Movies

ఈ స్టార్ హీరోని గుర్తు పట్టారా… ఇప్పుడు ఇలా మారిపోయి ఏ పాత్రలు చేస్తున్నాడో తెలుసా?

చామంతి మూవీతో స్టార్ స్టేటస్ తెచ్చుకున్న హీరో ప్రశాంత్ ఒకప్పుడు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. అగ్ర హీరోయిన్స్ సైతం ఇతని పక్కన నటించేవారు. తమిళంలో ఇతను నటించిన సినిమాలు ఆతరువాత అన్ని భాషల్లోకి డబ్ అయ్యేవి. జీన్స్,దొంగ దొంగ, జోడి చిత్రాలతో ఎవరెస్టు అంతటి రేంజ్ తెచ్చుకున్నాడు. జెమిని గణేశన్ తరవాత రొమాంటిక్ హీరోగా ముద్ర వేసుకున్న ప్రశాంత్ సరసన ఐశ్వర్య రాయ్, వంటి స్టార్ హీరోయిన్స్ సరసన నటించిన ప్రశాంత్ పరిస్థితి హై రేంజ్ కి వెళ్లి ఆతర్వాత గ్రాఫ్ పడిపోయింది. ముఖ్యంగా పెళ్లయ్యాక అతని జీవితం అల్లకల్లోలం అయిందని అంటారు.

పెళ్ళయితే మార్పు వస్తుందని అంటారు కానీ కొందరి జీవితాలు రివర్స్ అవుతాయి. సరిగ్గా ప్రశాంత్ విషయంలో అదే జరిగింది. మనసుకి నచ్చిన అమ్మాయిని పెళ్ళిచేసుకుంటే,ఆమె వరకట్నం,గృహహింస కేసులు పెట్టి నానా రకాలుగా బాధ పెట్టింది. కోరు మెట్లు ఎక్కించింది. ఇక ఓరోజు ఎవరో ఫోన్ చేసి మీ భార్యకు ఆల్ రెడీ పెళ్ళయిపోయిది, మీరు రెండో భర్త అని చెప్పడంతో ప్రశాంత్ గుండె విలవిలలాడిపోయింది.

ఒక్కసారిగా కుప్పకూలిపోయాడట. నెట్ ద్వారా ఆమె మొదటి పెళ్లి రిజిస్ట్రేషన్ గురించి ఆరాత్రంతా సెర్చ్ చేసాడట. ఏదైతేనేం కోర్టు ఇద్దరికీ విడాకులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రశాంత్ కి నిజంగా ప్రశాంతత ఏర్పడిందట. ఓపక్క భార్య నుంచి ఇబ్బందులు ఇలా ఎదురైతే, మరోపక్క ఇండస్ట్రీలో కూడా చేదు అనుభవాలు ఎదురవ్వడం ప్రశాంత్ గుండె నిబ్బరాన్ని దెబ్బతీశాయి.ఒకప్పుడు ఇంటికొచ్చి అడ్వాన్స్ లిచ్చిన ప్రొడ్యూసర్స్ ముఖం చాటేశారు.

స్వయంగా వెళ్లి ఛాన్స్ లు అడిగినా సరే, కొందరు లేదు పొమ్మన్నారు. కొత్త సినిమాలు మొదలు పుట్టినవాళ్ళు కూడా ఆపేశారట. అలా ఆగిపోయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇలా మానసికంగా కుంగిపోయిన ప్రశాంత్, ఇక చేసేది లేక కేరక్టర్ యాక్టర్ గా మారిపోయాడు. ఇక తెలుగులో రామ్ చరణ్ హీరోగా బోయపాటి డైరెక్షన్ లో వస్తున్న’వినయ విధేయ రామ’మూవీలో కేరక్టర్ రోల్ వేస్తున్నాడు. ఇటీవల రిలీజయిన టీజర్ లో రామ్ చరణ్ పక్కన ప్రశాంత్ ని చూసి ఫాన్స్ షాకయ్యారట. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమోనని ఫాన్స్ తెగ బాధపడిపోతున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణం అయిపోయాయి.