Devotional

ఉగాది 2020 నుండి 5 సంవత్సరాల వరకు ఈ రాశుల వారికీ రాజ యోగమే…పట్టిందల్లా బంగారమే

ఉగాది 2020 నుండి 5 సంవత్సరాల వరకు ఈ రాశుల వారికీ రాజ యోగమే…పట్టిందల్లా బంగారమే.ఆ రాశుల గురించి వివరంగా తెలుసుకుందాం.

కర్కాటక రాశి

ఈ రాశివారు పుట్టినప్పటి నుండి మంచి స్థితిలో ఉన్నా సరే ఈ రాబోయే 5 సంవత్సరాలు మరింత మంచి స్థితిలో ఉంటారు వీరు ఈ 5 సంవత్సరాలలో లగ్జరీ గా జీవితాన్ని ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే వీరి జీవితం కీర్తి,ప్రతిష్టలు,ధనంతో ఉంటుంది. వీరికి వచ్చే అవకాశాలు కూడా అలాగే ఉంటాయి. వాటిని సరైన సమయంలో వినియోగించుకొని సక్సెస్ అవుతారు.

వృశ్చిక రాశి

ఈ రాశివారు ధనం సంపాదించటానికి లక్ష్మి దేవి కటాక్షం పుష్కలంగా ఉంది. కాబట్టి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వీరి జాతకం ఎలా ఉంటుందంటే ఏది పట్టుకున్న బంగారమే అవుతుంది. ఏ పని చేసిన విజయవంతం అవుతుంది. ఈ రాశివారు ఏదైనా చేయాలనీ సంకల్పిస్తే ఆ పని అయ్యేవరకు దాని అంతు చూస్తారు. అంతలా వీరికి పట్టుదల ఉంటుంది.

వృషభ రాశి

ఈ రాశివారు చాలా మంచితనంతో ఉంటారు. ఈ రాశివారికి ఆరాధ్య దేవత శుక్రుడు. ఈ రాశివారికి ధనం సంపాదించే మార్గాలు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే వీరికి తిరుగు ఉండదు. సమయాన్ని ఉపయోగించుకొని ముందుకు సాగితే మీరు అనుకున్నది సాధిస్తారు. ఆర్ధికంగా ఉన్నత స్థితిలో ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి.

సింహ రాశి

సింహ రాశికి అధిపతి సూర్యుడు. గ్రహాలకు అధిపతి అయినా సూర్యుడు ఈ రాశి వారికి రాజయోగం కల్పించబోతున్నాడు. పన్నెండు రాశులలో శక్తివంతమైన రాశి సింహ రాశి. ఈ రాశివారికి దారి కనిపిస్తే చాలు ఆ దారిని పట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోతారు. అనుకున్నది సాధిస్తారు. కాస్త ప్రోత్సహం ఇస్తే చాలు వీరు వెనకడుగు వేయకుండా విజయాన్ని సాధిస్తారు. వీరు ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటారు. అంతలా విజయాలను సాధిస్తారు. ఈ రాశివారు ఏ పని చేసిన సక్సెస్ అవుతుంది. ఇంటిలో కూడా పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి.