ఆటో రామ్ ప్రసాద్ గురించి తెలియని నిజాలు…జబర్ధస్త్ కి రాకముందు ఏమి చేసేవాడో తెలుసా?
పంచ్ డైలాగులతో ఆటో వేయడం ద్వారా అదే ఇంటిపేరుగా మారిన రామ్ ప్రసాద్ ఆరేళ్ళు మెడికల్ షాపులో పనిచేసాడు. ఎడిటింగ్ నేర్చుకోవాలని వచ్చిన యితడు రైటర్ గా మారాడు. ఇక ప్రసన్న అనే ఫ్రెండ్ వలన ఇండస్ట్రీలో కెరీర్ పరంగా ఎదగటానికి దోహదమైందని చెబుతాడు. సుడిగాలి సుధీర్ స్క్రిప్ట్ పక్కాగా ఉంటాయంటే,దానివెనుక రామ్ ప్రసాద్ కలం ఉందని చెప్పక తప్పదు. 1986 మే3న విశాఖ పట్నంలో ఆదినారాయణ,ఆదిలక్ష్మి దంపతులకు జన్మించిన రామ్ ప్రసాద్ కి వాసుకి దేవి అనే అక్క ఉంది. ఆమెను సత్యారావు కి ఇచ్చి పెళ్లి చేసారు. తండ్రి ఆదినారాయణ ప్రస్తుతం కేటరింగ్ నిర్వహిస్తున్నాడు. చిన్నప్పటినుంచి చలాకీగా ఉండే రామ్ ప్రసాద్ కి చదువు అబ్బలేదు. ఇంటర్ వరకూ చదివి అది కాస్తా ఫెయిల్ అయ్యాడు.
చిన్నప్పటినుంచి స్టడీ మీద పెద్దగా ధ్యాస లేని రామ్ ప్రసాద్ రాత్రిళ్ళు మెడికల్ షాపులో బాయ్ గా పనిచేస్తూ స్కూల్ కి వెళ్ళేవాడు. ఇంటర్ ఫెయిల్ అయ్యాక మెడికల్ రిప్రజంటేటివ్ గా పనిచేసాడు. ఉదయం బైక్ మీద అన్ని హాస్పిటల్స్ కి వెళ్లి ప్రోడక్ట్స్ గురించి చెప్పేవాడు. అలా పనిచేస్తూ హైదరాబాద్ వెళ్లి మల్టీమిడియా నేర్చుకోవాలని అనుకున్నాడు. అక్కడ రూమ్ మేట్ ప్రసన్న రైటర్ కావడంతో తన ఆలోచనలను రామ్ ప్రసాద్ కూడా రాసేవాడు.
కొన్నాళ్ళకు మళ్ళీ వైజాగ్ వచ్చేసిన రామ్ ప్రసాద్, అక్కడినుంచే అవసరమైన స్క్రిప్ట్స్ ప్రసన్నకు రాసిపంపేవాడట. 2013లో జబర్ దస్త్ స్టార్ట్ కావడంతో ప్రసన్న అందులో చేరి స్క్రిప్ట్ రాసేవాడట. అప్పుడు రామ్ ప్రసాద్ ని కూడా రమ్మని చెప్పాడట. అయితే అప్పటికే మేరేజ్ అయినందున హైదరాబాద్ వెళ్తే సక్సెస్ వస్తుందో రాదోనని భయపడినా, చివరకు వచ్చి ధనరాజుకి స్క్రిప్ట్స్ రాసేవాడేట.
అయినా సెటిల్ అవుతామో లేదోననే అనుమానంతో విశాఖలోనే ఫ్యామిలీని ఉంచి, విశాఖకు హైదరాబాద్ కి తిరుగుతూ ఉండేవాడట. 2010లో అరుణను రామ్ ప్రసాద్ పెళ్లి చేసుకున్నాడు. నిజానికి రామ్ ప్రసాద్ , అరుణ లు స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్స్ కావడంతో క్లోజ్ అయ్యారు. స్థోమత గల కుటుంబం కావడంతో అరుణ చాల సార్లు రామ్ ప్రసాద్ కి డబ్బులు సర్దేదట. మొత్తానికి ఇద్దరి కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి వెంకట సౌరీష్ అనే బాబు ఉన్నాడు.
రామ్ ప్రసాద్ ఎవరో తెలియని రోజుల్లో అతడి పేదరికాన్ని నమ్మి అతడిని పెళ్లాడిన అరుణ నిజంగా గ్రేట్ అంటారు. అందుకే ఇద్దరు చాల హ్యాపీగా ఉన్నారు. ఇక సుధీర్ రాకతో శ్రీను సూచన మేరకు అతడి దగ్గర స్క్రిప్ట్ రైటర్ గా చేరి,సుధీర్ టీమ్ సక్సెస్ కి దోహదం చేసాడు. పంచ్ డైలాగులకు పెట్టింది పేరుగా నిల్చి,ఆటో రామ్ ప్రసాద్ గా గుర్తింపు పొందాడు.
నాగ చైతన్య 2009లో నటించిన జోష్ లో చిన్న పాత్రను రామ్ ప్రసాద్ చేసాడు. ఇక ఇండస్ట్రీలో చిరంజీవిని ఎంతగానో అభిమానించే వాడు. సినిమా చూపిస్తా మావా, నేను నా బాయ్ ఫ్రెండ్ ,నేను లోకల్ వంటి సినిమాలకు స్క్రిప్ట్ రాసిన తన ఫ్రెండ్ ప్రసన్న చొరవతో రామ్ ప్రసాద్ కు సదరు సినిమాల లో వేషాలు వచ్చేలా చేసాడట. అదేరీతిలో మెగాస్టార్ నటించిన ఖైదీ నెంబర్ 150లో ఓ రోల్ వేసాడు. అలాగే నాగార్జున నటించిన ఓం వెంకటేశాయ మూవీలో కూడా రామ్ ప్రసాద్ నటించాడు. భవిష్యత్తులో సినిమాలకు స్క్రిప్ట్ రైటర్ గా పనిచేయాలన్న కోరిక నెరవేర్చుకుంటాడో లేదో చూడాలి మరి.