ఈ ముగ్గురిలో ఎవరికీ ఎక్కువ ఓట్లు పడ్డాయో తెలుసా?
రాష్ట్రంలో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికలు ఉత్కంఠతో ముగిసాయి. అధికార టీడీపీ, విపక్ష వైస్సార్ సిపి,కొత్తగా బరిలో దిగిన జనసేన ల మధ్య పోరు రసవత్తరంగా నడించింది. చంద్రబాబు,జగన్,పవన్ కళ్యాణ్ లు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఇక కీలకమైన పోలింగ్ ఘట్టం ఏప్రియల్ 11న ముగిసింది. ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. అయితే వైసిపి అధికారంలోకి వచ్చేస్తోందంటూ పలు సర్వేలు చెప్పడంతో ఆ పార్టీ వాళ్ళు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అంతేకాదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎపి సీఎం అనే బోర్డు కూడా రెడీ చేసుకున్నారు. ఇక టిడిపి ఎన్నికల సంఘం పై యుద్ధం చేస్తూనే 130సీట్లు వస్తాయని చెబుతోంది. మరోపక్క వైసిపి కూడా 130సీట్లు తమకే వస్తాయని అంటోంది.
ఇలా ఈ రెండు పార్టీలు కేడర్ ని ఉత్తేజ పరిచేలా స్టేట్ మెంట్స్ గుప్పిస్తుంటే, జనసేన మాత్రం ప్రశాంతంగా ఉంది. ఎన్నికల్లో ప్రచారం హోరెత్తించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రశాంతంగా ఉండడం పై సర్వత్రా చర్చకు దారితీసింది. జనసేనను ఎదగనీయకుండా, అభ్యర్థులు కూడా దొరక్కుండా ఓ పక్క వైసిపి,మరోపక్క టిడిపి విశ్వప్రయత్నం చేసినప్పటికీ మార్పు కోసం పవన్ కళ్యాణ్ పెద్ద యుద్ధమే చేసాడు. జీరో బడ్జెట్ తో రాజకీయాలు చేయాలని చేసిన ప్రయత్నం పలువుర్ని ఆకట్టుకుంది. కానీ ఛానల్స్ లో కూడా వైసీపీదే అధికారమని,మరికొన్ని ఛానల్స్ అయితే టీడీపీదే అధికారమని డంకా బజాయించి చెబుతున్నాయి. కానీ జనసేన గురించి ఎవరూ ప్రస్తావించడం లేదు.
అధికారం మాట అటుంచి సింగిల్ డిజిట్ కి పరిమితం అవుతుందని అంటున్నారు. మరికొందరైతే జనసేనకు ఒక్కసీటు కూడా రాదని చెప్పేస్తున్నారు. కానీ ఇలా జనసేనను తక్కువ చేసి చూసేవాళ్ల చెంప ఛెళ్లుమనిపించేలా జనసేనకు సీట్లు రాబోతున్నాయని అంటున్నారు. సైలెంట్ ఓటింగ్ వెనుక జనసేన ప్రభావం ఉందని,మహిళలు,యువత ఎక్కువగా జనసేనకు ఓటేశారని విశ్లేషిస్తున్నారు. జనసేనకు ఓటు వేయడం కోసమే ఎంతసేపైనా క్యూలో ఉండి ఓటు వేశారని అంటున్నారు.జనసేనకు ఓటు వేయడానికి హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసేవాళ్ళు,ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు తమ సొంత ఖర్చులతో తమ ప్రాంతాలకు వచ్చి ఓటు వేయడమే కాకుండా, తమ ఇంట్లో వాళ్ళమీద కూడా ఒత్తిడి తెచ్చి మరీ ఓటు వేయించారని నిగ్గుతేలుతున్నాయి.
టిడిపి,వైసిపిలతో సంబంధాలు ఉన్నవాళ్లు సైతం తమ పిల్లలకోసం జనసేనకు ఓటు వేశారని అంటున్నారు. వృద్ధుల్లో సైతం కొందరు పవన్ కి ఓటు వేశారని అంటున్నారు. క్రాస్ ఓటింగ్ బలంగానే జరిగిందని అంటున్నారు. పార్లమెంట్ కి వచ్చేసరికి కొన్ని చోట్ల జనసేనకు,కొన్ని చోట్ల అసెంబ్లీ స్థానాల్లో జనసేనకు ఓటు వేశారని అంటున్నారు. రాష్ట్రంలో జనసేన ప్రభంజనం సైలెంట్ గా ఉండబోతోందని ఇది ఎవరూ అంచనా వేయలేరని అంటున్నారు. టిడిపి వస్తుందో,వైసిపి వస్తుందో ఈ రెండూ కాకుండా సైలెంట్ గా జనసేన దూసుకొస్తుందో చూడాలి మరి.