చంద్ర గ్రహణం తర్వాత ఏ రాశివారు ఏ పరిహారం చేయాలో తెలుసుకొని దోషాన్ని పోగొట్టుకోండి
ఈ రోజు ఆషాడ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతున్న విషయం మనకు తెలిసిందే. చంద్రగ్రహణం తర్వాత ఏ రాశులవారికి ఎలాంటి ఫలితాలు ఏర్పడతాయో తెలుసుకుందాం. ఏ రాశివారు ఏ దోషానికి ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. చంద్రగ్రహణం ఉత్తరాషాఢ 12 పాదాలలో ఏర్పడుతుంది. అంటే ధనస్సు రాశి ,మకర రాశివారు ఈ గ్రహణాన్ని చూడకూడదు. అంతేకాక ఈ రాశుల వారు గ్రహణ శాంతి తప్పనిసరిగా చేయించుకోవాలి. గ్రహణం వృషభ,మిధున లగ్నంలో ఏర్పడుతుంది కాబట్టి వీరు చంద్రగ్రహణం పూర్తీ అయ్యాక తలస్నానము చేసి శివాభిషేకం చేయించుకుంటే మంచిది. ఇలా సహ్యించుకోవటం వలన గ్రహణం కారణంగా ఏర్పడే నెగిటివ్ ఎఫెక్ట్ కాస్త తగ్గే అవకాశం ఉంది.
ఆషాడ పౌర్ణమి రోజు ఏర్పడుతున్న చంద్రగ్రహణం కారణంగా కొన్ని రాశుల వారికీ మంచి కొన్ని రాశుల వారికీ ఇబ్బందులు కలుగుతాయి. గ్రహణం పట్టు విడుపు సమయాలను బట్టి రాశులకు మంచి చెడు అనేవి జరుగుతూ ఉంటాయి. మేష రాశి ,మిధున రాశి ,కర్కాటక రాశి ,సింహ రాశి ,ధనస్సు రాశి ,మకర రాశుల వారు కొంత దోష నివారణ పూజలు చేయించుకోవాలి. అలాగే శివభిషేకం చేయించుకుంటే గ్రహణ పట్టు,విడుపు సమయాల బట్టి వచ్చే దోషం నివారణ అవుతుంది. తుల రాశివారికి ఈ గ్రహణం కరనంగా మంచి ఫలితాలు కలగబోతున్నాయి. మీనా రాశి, వృసభ రాశి,కుంబ రాశి,వృశ్చిక రాశులకు ఈ చంద్ర గ్రహణం పట్టు,విడుపు సమయాలను బట్టి మధ్యమ ఫలితాలు కలుగుతాయి.
మధ్యమ ఫలితాలు మరియు మంచి ఫలితాలు కలిగే రాశుల వారు ఎటువంటి పరిహారాలు చేయవలసిన అవసరం లేదు. చంద్ర గ్రహణం ఏర్పడే దానస్సు రాశి,మకర రాశివారు కంచు పాత్రలో నెయ్యి వేసి ఆ నెయ్యితో పాటు వెండి చంద్ర బింబన్ని బ్రాహ్మణులకు దానం చేయాలి. మేష రాశి ,మిధున రాశి ,కర్కాటక రాశి ,సింహ రాశుల వారు శివాభిషేకం చేయించుకుంటే గ్రహణ పట్టు,విడుపు సమయం కారణంగా వచ్చే దోషాలు తొలగిపోతాయి. ఈ విధంగా చేయటం వలన మనకు మానసికంగా ప్రశాంతత రావటంతో పాటు చేసే పనులలో ఆటంకాలు రావు.