రిటైర్మెంట్ తరవాత రాజమౌళి ఏమి చేస్తాడో తెలుసా?
సినిమాల నుంచి రిటైర్ అయ్యాక ఏం చేయాలన్న విషయంలో కొంతమంది దర్శకులు అప్పుడే భారీగా ప్లానింగులు చేసుకుంటున్నారు. మరో ఐదేళ్ల తరవాత రిటైర్ అయిపోతానని, ఆ తరవాత ఎక్కువ భాగం ప్రజా సేవలోనే గడుపుతానని ఇటీవల కొరటాల శివ ప్రకటించారు. ఇప్పుడు రాజమౌళి కూడా రిటైర్మెంట్ తరవాత రోజుల గురించి ఆలోచనలో పడ్డాడు. పదేళ్ల వరకూ రిటైర్మెంట్ ఆలోచన లేదంటున్న రాజమౌళి, ఆ తరవాత ఏం చేయాలన్న విషయంపై ఇప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేశాడు.
నల్గొండ జిల్లాలో ఈదులూరు అనే ఓ గ్రామం ఉంది. అక్కడ రాజమౌళి కుటుంబం భారీగా పొలాల్ని కొనుగోలు చేసింది. అక్కడో ఫామ్ హోస్ లాంటిది ఏర్పాటు చేసుకున్నారు. నెలకోసారి అక్కడకు వెళ్లి, సరదాగా గడిపిరావడం అలవాటు. రాజమౌళి కుటుంబానికి సంబంధించిన ఏ వేడుక అయినా అక్కడే జరుగుతుంది. పదేళ్ల తరవాత.. కుటుంబం మొత్తం అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్నార్ట. కీరవాణి, విజయేంద్రప్రసాద్, కల్యాణీ మాలిక్.. ఇలా రాజమౌళి కుటుంబం అంతా ఒకే చోట స్థిరపడబోతోందని తెలుస్తోంది.