Devotional

జులై 21 నుండి అమర్నాథ్ యాత్ర.. కానీ?

అమర్నాథ్ యాత్ర.ఈ యాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ యాత్ర జులై 21న ప్రారంభం అయ్యి ఆగస్టు 3వ తేదీ వరకు అంటే కేవలం 15 రోజులు మాత్రమే ఈ యాత్ర కొనసాగనుంది.హిందువుల పవిత్రమైన పుణ్యక్షేత్రల్లో అమర్నాథ్ ఒకటి.

అయితే అన్ని పుణ్యక్షేత్రాల్లా ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఈ పుణ్యక్షేత్రంకు వెళ్లలేం.హిమాలయాల్లో ఎంతో కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే ఈ యాత్రకు వెళ్ళేకి అవకాశం ఉంటుంది.

అయితే కరోనా వైరస్ కారణంగా ఈసారి కేవలం 15 రోజులు మాత్రమే అనుమతిని ఇచ్చారు.జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీష్ చంద్ర ముర్ము అధ్యక్షతన జరిగిన శ్రీ అమర్ నాథ్ జీ పుణ్య క్షేత్రం బోర్డు సమావేశంలో ఈ షెడ్యూల్ ఫిక్స్చే శారు.

అయితే యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.కాగా ఈ ఏడాది కేవలం ఉత్తర కశ్మీర్‌లో బల్తాల్ క్యాంప్ ద్వారా మాత్రమే యాత్రకు అనుమతి ఇస్తారు.

ఇంకా అంతేకాదు ఈ యాత్రకు కేవలం 55 ఏళ్ళ లోపు వారికి మాత్రమే అనుమతి.