Movies

పెళ్లికి ముందు యోగా భామ పక్కా ప్లాన్ ఏమిటో తెలుసా?

అందం అభినయం తో గ్లామర్ హీరోయిన్ గానే కాదు, నాయికా ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటించడం లో కూడా స్వీటీ అనుష్క శెట్టి తనదైన ముద్ర వేసింది. అయితే ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ తప్ప మరొకటి చేసే ఉద్దేశ్యం ఆమెకు లేవని టాక్. తాజా పరిణామం చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. బాహుబలి సినిమాతో ఎక్కడలేని ఇమేజ్ తెచ్చుకున్న తర్వాత అనుష్క ఎంపికలు పరిశీలిస్తే, జీరోసైజ్.. భాగమతి.. నిశ్శబ్ధం .. ఇవన్నీ ఓన్లీ లేడీ ఓరియెంటెడ్ వైపే టర్న్ అయిందా అనిపిస్తుంది. ఇక పాన్ ఇండియా మూవీ `నిశ్శబ్ధం` ఈపాటికే రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా లాక్ డౌన్ క్రైసిస్ కారణంగా రిలీజ్ కి నోచుకోలేదు.

లాక్ డౌన్ సడలింపుల్లో ఇంకా థియేటర్స్ ఓపెన్ కాలేదు. ఎప్పుడు అవుతాయో కూడా చెప్పడం ఇప్పట్లో కష్టమే. అందుకే `నిశ్శబ్ధం` విషయంలో థియేట్రికల్ రిలీజ్ కోసం వేచి చూస్తున్నారని లేదూ ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేశారని రకరకాలుగా టాక్ నడుస్త్తోంది. ఆ సినిమా సంగతి అటుంచితే స్వీటీ మరోసారి లేడీ ఓరియెంటెడ్ కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. స్టార్ హీరోలు.. స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసే కంటే నాయికా ప్రాధాన్యం ఉన్న కథల్ని తెచ్చే యువ దర్శకులకే స్వీటీ అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేస్తోంది.

ఎందుకంటే,.. స్వీటీ పెళ్లి విషయమై ఇంటిపోరు చాలా కాలంగా ఉండడంతో పెళ్లికి ముందే గ్లామరస్ రోల్స్ చేయకుండా ఇలా లేడీ ఓరియెంటెడ్ వైపే మొగ్గు చూపుతోందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈసారి మిర్చి-భాగమతి లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన యువి క్రియేషన్స్ తో యోగా భామ ఫిక్స్ అయిందట. మరోవైపు `రా రా కృష్ణయ్య` ఫేం మహేష్.పి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అతడికి ఇది రెండో సినిమా. నాయికా ప్రాధాన్యం.. రొమాన్స్ జోనర్ లో కథాంశాన్ని సిద్ధం అయిందట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాల్ని యువి సంస్థ అందించాల్సి ఉంది.