Movies

“సర్కారు వారి పాట” లో విలన్ గా స్టార్ హీరో…?

మహేష్ బాబు సినిమాలను ఆచి తూచి ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఎక్కడ కంగారు పడకుండా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మహేష్ బాబు పరుశరాం దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించి టైటిల్,ప్రి లుక్ విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. మహేష్ బాబుకు మరొక బ్లాక్ బస్టర్ విజయం ఖాయమని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా విషయంలో మహేష్ అలాగే నమ్రత ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు.

ఈ సినిమా లో విలన్ పాత్ర కోసం అరవింద్ స్వామి ను సంప్రదించినట్లు సమాచారం. ఎందుకంటే ఈ సినిమాలో విలన్ పాత్ర హీరోకి ధీటుగా ఉంటుందట. రామ్ చరణ్ నటించిన ధృవ చిత్రం లో అరవింద్ స్వామి స్టైలిష్ గా ఉంటూ, హీరో పాత్రకు ఏ మాత్రం తగ్గకుండా చాలా బాగా చేశారు. అందుకే అరవింద్ స్వామిని సంప్రదించారట. అరవింద్ స్వామి ఈ సినిమా కోసం భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేసాడట. దానికి కూడా ఒప్పుకున్నారని సమాచారం.