రామ్ చరణ్,అల్లు అర్జున్ కలిసి కాజా తింటున్న ఈ ఫోటో ఎప్పటిదో తెలుసా ?
రామ్ చరణ్,అల్లు అర్జున్ కలిసి కాజా తింటున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ ఫోటో ఎప్పటిది…ఆ కథ గురించి తెలుసుకుందాం. ఈ ఫోటో 2009 నాటిది. అప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు కదా. ఆ సమయంలో పార్టీ ప్రచారం కోసం హైదరాబాద్ నుండి ప్రత్యేక ట్రైన్ లో రామ్ చరణ్ , అల్లు అర్జున్ తో పాటు మరికొంత మంది సినిమా స్టార్స్….చిరంజీవికి మద్దతుగా ప్రజా రైలు యాత్ర చేశారు.
రామ్ చరణ్, అల్లు అర్జున్ ఉభయ గోదావరి జిల్లాలో పార్టీ ప్రచారంలో ఉండగా…. ఫ్యాన్స్ ఇచ్చిన వరల్డ్ ఫేమస్ తాపేశ్వరం కాజా తింటున్నప్పుడు తీసిన ఫోటో ఇది.. ఆ ఫోటోను సరదాగా తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అయింది.