దివ్య భారతి సిస్టర్ టాప్ హీరోయిన్ అన్న విషయం మీకు తెలుసా? నమ్మలేని నిజాలు
ఉత్తరాది నుంచి వచ్చి మంచి స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ హఠాత్తుగా ఈలోకం నుంచి నిష్క్రమించిన హీరోయిన్ దివ్యభారతి గుర్తుందా? విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ బొబ్బిలి రాజాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి ,అనూహ్య విజయాన్ని నమోదుచేసుకుంది. బొబ్బిలి రాజాతోనే సినీ ఫీల్డ్ లోకి ప్రవేశించిన ఈమె తెలుగు, తమిళ ,హిందీ భాషల్లో దాదాపు 14మూవీస్ చేసింది. తెలుగులో రౌడీ అల్లుడు, అసెంబ్లీ రౌడీ,ధర్మ క్షేత్రం ఇలా తెలుగు అగ్ర నటుల సరసన నటించింది. ఈమె 1992 మే లో సాజిద్ నజీద్ వాలా ను పెళ్లాడిన దివ్యభారతి ఏప్రియల్ 1993లో అంటే కేవలం 19ఏళ్ళ వయసులోనే అనుమానాస్పదంగా మరణించింది.
ఇక దివ్యభారతి ని చాలామంది మర్చిపోయివుంటారు. అయితే ఈమె చెల్లెలు కైనత్ అరోరా ప్రస్తుతం వెండితెరపై ఎంట్రీ ఇచ్చి, హిట్ చిత్రాలతో దూసుకెళ్తోంది. నిజానికి దివ్యభారతి ఫాథర్ కి ఇద్దరు భార్యలు. అందులో అరోరా మొదటి భార్య కూతురు. ఈమె 1986 సెప్టెంబర్ లో ఉత్తర ప్రదేశ్ లోని సహజ్ పూర్ లో జన్మించింది. కైనత్ అరోరా కుటుంబం 16ఏళ్ళ వయస్సులో ఢిల్లీ వచ్చేసింది. అక్కడ ప్రతిష్టాత్మక నేషనల్ ఫ్యాషన్ టెక్నాలజీ లో బిజినెస్ కోర్సు చేస్తూనే మోడలింగ్ ప్రారంభించింది. లక్స్,మారుతి 800, క్యాడ్బారి తదితర కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ అయింది.
ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లో రాకెట్ లా దూసుకెళ్తూ,దివ్యభారతి మించిపోయిందా అన్నట్లు ఉంది. కైనత్ అరోరా మొదట్లో ముంబయిలో మిస్ కేరళ పోటీలకు జడ్జిగా వ్యవహరించింది. ఇక ఆసమయంలో డైరెక్టర్ ప్రియదర్శన్ తో పరిచయం ఏర్పడడం, అప్పటికే ఆయన తీస్తున్న కట్టా మిట్టా మూవీలో ఐటెం సాంగ్ కోసం మోడల్ ని వెతుకుతుండడంతో ఆ ఛాన్స్ కైనత్ అరోరా కి దక్కింది.
ఆవిధంగా ఐటెం సాంగ్ ద్వారా 2010లో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కైనత్ అరోరా 2011లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో మన్ ఖాతా అనే తమిళ చిత్రంలో నటించింది. ఇందులో అర్జున్,ప్రేమ్, అంజలి ,యాండ్రియా,త్రిష,లక్ష్మీరాయ్,అజిత్ కుమార్ తదితరులు కూడా నటించారు. 2013లో గ్రాండ్ మస్తీ కామెడీ ఫిలిం,స్వాగతా బ్యాక్ వంటి హిట్ మూవీస్ లో హీరోయిన్ గా అలాగే ఐటెం సాంగ్స్ లో నటించింది.