Devotional

ఈ నెల 21 న సంపూర్ణ చంద్రగ్రహణం మన భారత దేశంలో కనిపిస్తుందా… నియమాలు పాటించాలా? ఏ రాశివారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

ఈ నెల 21 న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పుష్య మాసంలో శుక్ల పక్షం పౌర్ణమి తిధి రోజున జనవరి 21 సోమవారం సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ నెల 21 న వచ్చే చంద్ర గ్రహణం మన భారత దేశంలో కనిపించటం లేదు. ఈ చంద్ర గ్రహణం సంపూర్ణ చంద్ర గ్రహణం. దీనిని సూపర్ రెడ్ మూన్ అని చెప్పి ప్రపంచం అంతా వీక్షించాలని ఎదురు చూస్తున్నారు. ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం మన భారత దేశంలో కంపించటం లేదు. కాబట్టి మనం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం దక్షిణ అమెరికా, యూరప్,ఆఫ్రికా దేశాలలో కన్పిస్తుంది. ఈ చంద్ర గ్రహణాన్ని రాహు గ్రస్త చంద్ర గ్రహణం అని శాస్త్రజ్నులు చెప్పుతున్నారు. గ్రహణం అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఏమైనా పరిహారాలు చేసుకోవాలా? గ్రహణ నియమాలు పాటించాలా? గర్భవతులు జాగ్రత్తగా ఉండాలా? అనే సందేహాలు వస్తూ ఉంటాయి.

ఈ చంద్ర గ్రహణం పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశిలో ఏర్పడుతుంది. మన భారత కాలమానం ప్రకారం చంద్ర గ్రహణం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. చంద్రుడు మనస్సు మీద ప్రభావం చూపుతాడు. కాబట్టి ఈ చంద్ర గ్రహణం సమయంలో సింహా రాశి,కర్కాటక రాశి వారు శివభిషేకాలు చేయించుకుంటే మంచిది. మన భారత దేశంలో కనిపించకపోయిన మనః కారకుడు చంద్రుడు కాబట్టి మానసిక ఒత్తిడి లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే పరిహారం చేయాలి.

గ్రహణ పట్టు స్నానం,విడుపు స్నానం చేయవలసిన అవసరం లేదు. గర్భవతులు కూడా కదలకుండా కూర్చోవాలనే జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం లేదు. కర్కాటక రాశిలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కర్కాటక రాశివారు, ఆ రాశికి ముందు రాశి వెనక రాశి మిధున రాశి,సింహా రాశివారు కూడా జనవరి 22 న శివభిషేకం చేయించుకుంటే మంచిది. ఒకవేళ అభిషేకం చేయటం కుదరకపోతే ఓం నమశ్శివాయ మంత్రాన్ని 11 సార్లు లేదా 108 సార్లు పఠిస్తే గ్రహణం ప్రభావం తగ్గుతుంది. ఓం నమశ్శివాయ మంత్రాన్ని గ్రహణ సమయంలో పఠిస్తే వెయ్యి రేట్లు ఫలితం ఉంటుంది.