శిల్పాశెట్టి ‘చెల్లెలు’ కూడా టాలీవుడ్ లో హీరోయిన్ అని తెలుసా?
బాలీవుడ్ కావచ్చు,టాలీవుడు కావచ్చు,కోలీవుడ్ అయినా సరే, సినిమా ఇండస్ట్రీ లో ఎక్కడైనా సరే,వారసత్వం అనేది కామన్ అయింది. హీరోయిన్స్,హీరోలు,కేరక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్స్ ,సాంకేతిక నిపుణులు,కొరియోగ్రాఫర్స్ ఇలా అందరి వారసులు సిల్వర్ స్క్రీన్ పై మెరిసిపోవాలని వస్తున్నారు. అయితే కొందరు సక్సెస్ అవుతారు. మరికొందరు అవ్వరు. ఇక అసలు విషయానికి వస్తే,తెలుగులో ‘సాహస వీరుడు సాగర కన్య సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించి అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న శిల్పాశెట్టి సినీరంగంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగితే, ఆమె చెల్లెలు కూడా సినీ రంగానికి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఇప్పుడు ఏకంగా బుల్లితెర స్టార్ గా బిజీ అయింది.
మోడల్ రంగంలో బాగానే రాణించిన శిల్పాశెట్టి సినిమా రంగానికి రావాలని ప్రయత్నిస్తే,ఆమెను చూసి నువ్వు పనికిరావని అన్నారట. ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు. అయితేనేం తన అందంతో ఆడియన్స్ ని ఓ ఊపు ఊపేసింది. బాలీవుడ్ లో బాజీగర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈమె సల్మాన్ ఖాన్,షారుఖ్ ఖాన్,అమీర్ ఖాన్ వంటి అగ్ర హీరోల సరసన నటించి, తన సత్తా చాటింది. ఇక తెలుగులో వెంకటేష్ తో సాహస వీరుడు సాగర కన్య ,నాగార్జున తో ఆజాద్,,బాలకృష్ణ తో భలేవాడివి బాసు వంటి సినిమాల్లో నటించింది.
అలా తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైంది.ఇక తమిళ,కన్నడ,మళయాళ భాషల్లో కూడా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కాగా బిగ్ బ్రదర్ వంటి రియాల్టీ షోలో కూడా పాల్గొని,అందరి దృష్టిని ఆకర్షించింది. పెళ్లయ్యాక, రియాల్టీ షోస్ లో పార్టిసిపేట్ చేస్తూ బుల్లితెరపై దూసుకెళ్తోంది. ఇక శిల్ప చెల్లెలు షమితా శెట్టి కూడా హీరోయిన్ గా రాణించింది.
అక్క ఎంకరేజ్ మెంట్ తో హిందీలో మహబతే సినిమా తో ఎంట్రీ ఇచ్చిన ఈమె తొలిచిత్రంతోనే ఫిలిం ఫేర్ అవార్డు కొట్టేసింది. ఆతర్వాత ఎన్నో హిందీ సినిమాల్లో స్టార్ హీరోస్ సరసన నటించిన ఈమె తెలుగులో పిలిస్తే పలుకుతా సినిమాలో హీరో ఆకాష్ సరసన నటించి,అక్కలాగే తెలుగు ఆడియన్స్ ని చెల్లెలు కూడా అలరించింది. అంతేకాదు అక్కలాగే టివి రియాల్టీ షోస్ లో కూడా షమితా శెట్టి రాణించింది.