ప్రేమలేఖ సినిమాలో నటించిన దేవయాని గుర్తు ఉందా…. ఆమె ఇప్పుడు సినిమాలకు దూరంగా ఏమి చేస్తుందో తెలుసా?
సుస్వాగతం మూవీలో పవన్ తో జోడి కట్టిన దేవయాని పలు సినిమాల్లో హీరోయిన్ గా, ఆతర్వాత కేరక్టర్ ఆర్టిస్టుగా ప్రత్యేకతను చాటుకుంది. ప్రస్తుతం ఆమె సినిమా రంగానికి దూరమై అధ్యాపక వృత్తితో నెట్టుకొస్తోంది. ఆమె వయస్సు ప్రస్తుతం 40ఏళ్ళు. తనకంటూ నచ్చిన కేరక్టర్స్ లేకపోవడంతో సినిమాలకు దూరమవుతూ వచ్చింది. నిజానికి ఈమె తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన కాదల్ కొట్టి అనే మూవీతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఆసినిమా ప్రేమలేఖ పేరిట తెలుగులో విడుదలై సంచలనం సృష్టించింది.
పక్కింటి అమ్మాయి రోల్స్ కి సరిగ్గా సరిపోయే దేవయాని తెలుగులో సూర్యవంశం ఫ్రెండ్స్, మరువలచి తెనాలి వంటి చిత్రాలతో మంచి ప్రాచుర్యం పొందింది. కుర్ర హీరోయిన్స్ పోటీకి తట్టుకోలేక,ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉండడం వంటి వాటివలన సినిమాల్లో ఛాన్స్ లు తగ్గుతూ వచ్చాయి. 2001లో డైరెక్టర్ రాజ్ కుమార్ ని పెళ్లాడిన దేవయానికి ఇనియా, ప్రియాంక అనే ఇద్దరు ఆడపిల్లలు.
ఇద్దరూ అచ్చం ఆమెలానే ఉంటారు. ఇక సినిమా లలో ఛాన్స్ లు లేకపోవడంతో బుల్లితెరమీద ఆరంగేట్రం చేసింది. రెమ్యునరేషన్ తీసుకొని నటిగా ప్రత్యేకత కూడా సొంతం చేసుకుంది. ఇక భర్త రాజ్ కుమార్ డైరెక్షన్ లో కొన్ని మూవీస్ కూడా నిర్మించిన దేవయాని,అనూహ్యంగా నటనకు పూర్తిగా దూరమై ఓ పాఠశాలలో పనిచేయడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. టీవీల్లో ఛాన్స్ లు వస్తున్నా ఒకే తరహా పాత్రలు బోర్ కొడుతున్నాయని ఆమె పేర్కొంది.
అందుకే భిన్నంగా ఏదైనా చేయాలని భావించి, చిన్ననాటినుంచి ఉపాధ్యాయురాలిగా పనిచేయాలన్న కోరికను ఈవిధంగా నెరవేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. దీనికోసం టీచర్ కోర్సు పూర్తిచేసి, తన పిల్లలు చదివే చర్చిపార్క్ స్కూల్ లో అధ్యాపకురాలిగా చేస్తున్నానని చెప్పింది. జీతం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని,పైగా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందని చెప్పింది.