Movies

బ్రదర్స్ గురించి షాకింగ్ విషయాలు చెప్పేసిన నాగబాబు

స్వయం కృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాదు మెగా ఫ్యామిలీకి కూడా ఓ క్రేజ్ వుంది. చిరంజీవి సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ ,అలాగే రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధర్మ తేజ్,ఇలా చాలామంది మెగా ఫామిలీ నుంచి ఇండస్ట్రీలో తమ తమ స్థాయిల్లో సత్తా చాటుతున్నారు. ఎవరికి వారే డిఫరెంట్ కేరక్టర్స్. అందులో నాగబాబు శైలి వినూత్నం గా ఉంటుంది. నాగబాబు నటుడిగా, నిర్మాతగా,టివి సీరియల్ నటుడుగా, టివి షోస్ లో జడ్జిగా ఇలా విభిన్న కోణాల్లో రాణిస్తున్నాడు.

ఇక ఇటీవల యూట్యూబ్ లోకి అడుగుపెట్టి నా ఛానల్ నా ఇష్టం అంటూ కామెడీ తో నాగబాబు ఏకి పారేస్తున్నాడు. కొంతమంది పొలిటికల్ ప్రముఖులను టార్గెట్ చేసుకుని నాగబాబు చేస్తున్న వీడియోలకు లక్షల్లో వీక్షకులు ఉన్నారు. ఇక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్యూలో కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు. మా అన్నదమ్ములం ముగ్గురం కల్సి కూర్చుని తాగిన సందర్భాలు లేవని,ఇక చిరంజీవి అయితే ఎప్పుడైనా పార్టీలకు వెళ్ళినపుడో ఫంక్షన్ ఉంటేనే తప్ప రోజూ మందు తాగడని నాగబాబు చెప్పుకొచ్చాడు.

అప్పుడప్పుడు మాత్రమే అన్నయ్య డ్రింక్ చేస్తాడని వివరించాడు. ఇక పవన్ కళ్యాణ్ చాలా తక్కువగానే డ్రింక్ చేస్తాడని చెప్పాడు. గతంలో బాగా డ్రింక్ చేయడం,నాన్ వెజ్ తినేవాడినని చెబుతూ అయితే ఇక దగ్గు రావడం వలన దమ్ము కొట్టడం కూడా ఆపేశానని అన్నారు. తన ఆరోగ్యం ఇటీవల బాగా దెబ్బతిందని, ఊపిరి తిత్తుల సమస్య వచ్చిందని, అందుకే దురలవాట్లకు దూరమయ్యాయని వివరించాడు. ఇక ముగ్గురం కలిస్తే, సరదాగా కబుర్లు చెప్పుకోవడం, కల్సి భోజనం చేయడం ఉంటాయని అన్నాడు. ,అసలు ముగ్గురం కల్సి చీర్స్ చెప్పుకున్న దాఖలాలు లేవని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసాడు.