జయసుధ తెలుగుదేశం నుండి వైసిపిలోకి రావటం వెనక కారణం ఏమిటో తెలుసా?
రాష్ట్రంలో ఎన్నికల సందడి ఊపందుకుంది. ప్రధాన పార్టీలు తమ విమర్శల దాడి వేడీ పెంచాయి. అధికార టిడిపికి,విపక్ష వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో సత్తా చాటి అధికారం కైవసం చేసుకోవాలని శ్రమిస్తున్నారు. ఇక నాయకులు కూడా తమకు అనువైన స్థానాలకు కన్నేసి,పార్టీలు కూడా మారుతున్నారు. తాజాగా డేటా చోరీ వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. టీడీపీ,వైసిపి మధ్య చిచ్చు రగిల్చింది. ఇక సెలబ్రిటీలు ఎక్కువగా వైసిపి గూటికి చేరిపోతున్నారని పరిణామాలు తెలుపుతున్నాయి.
ఇప్పటికే టాలీవుడ్ నుంచి స్టార్ కమెడియన్ పృథ్వి వైసిపిలో చేరారు. అంతేకాదు పృథ్వికి కీలక పదవి ఇచ్చారు. చోటా కె నాయుడు,పోసాని కృష్ణమురళి ఇలా చాలామంది జగన్ కి మద్దతు ఇస్తున్నారు. చాలామంది జగన్ వైపే చూస్తున్నారు. నాగార్జున ,భానుచందర్,తదితరులు జగన్ ని కల్సి చర్చలు జరిపారు. తాజాగా సహజనటి జయసుధ కూడా వైసిపి లో చేరారు. 2009నుంచి రాజకీయాల్లో గల జయసుధ అప్పటిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలు నచ్చి కాంగ్రెస్ లో చేరారు.
సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి జయసుధ విజయం దక్కించుకున్నారు. అయితే 2014లో ఓటమి పాలయ్యారు. ఆతర్వాత ఆ మధ్య టిడిపిలో చేరినప్పటికీ,పార్టీ వేదికలమీద ఎక్కడా కనిపించలేదు. ఆమె భర్త మరణంతో ఇంటికి పరిమితమైన జయసుధ మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించాలని భావిస్తోంది.
వైసిపిలో తారలు ఎక్కువ చేరడం,టిడిపిలో గుర్తింపు లేకపోవడంతో వైసిపి లో చేరితే ఎడ్జెస్ట్ కావచ్చని భావిస్తోందట. ఎపి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి విజయవాడ,విశాఖ లలో ఎక్కడో ఒకచోటు నుంచి బరిలో దిగాలని ఆమె కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈమెకు ఎక్కడ బెర్త్ కన్ఫర్మ్ చేస్తారో చూడాలి.