25 సినిమాల ల్యాండ్ మార్క్ ను చేరుకున్న 8 మంది హీరోలు
అప్పటి హీరోలలాగా 100, 200 సినిమాలు చేయడం ఈ తరం హీరోలకు కష్టమైన విషయమే. అసాధ్యం కూడా. అప్పట్లో సెంచరీ చేయడం అనేది ఒక ల్యాండ్ మార్క్ గా పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఆ ల్యాండ్ మార్క్ కాస్తా 25 సినిమాలకు తగ్గింది.ఈ జనరేషన్ హీరోలు 25 సినిమాలు చేయడాన్ని ఒక ల్యాండ్ మార్క్ గా ఫీలవుతున్నారు. ఇలా 25 సినిమాకు చేరువలో ఉన్న.. రీసెంట్ గా క్రాస్ చేసిన హీరోలు కొంతమందిని చూద్దాం.
నాని
2005లో ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన నాని 25 సినిమాల ల్యాండ్ మార్క్ ను చేరుకుంటున్నాడు.
శర్వానంద్
శర్వానంద్ మొదటగా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలలో నటించాడు. మొదటినుండీ కూడా విభిన్న పాత్రలను చేస్తూ వెళుతున్న శర్వా .. ‘మహానుభావుడు’ సినిమాతో 25 సినిమాల ల్యాండ్ మార్క్ అందుకున్నాడు.
మహేశ్ బాబు
1999 లో ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా పరిచయమైన మహేష్ బాబు .. ఇప్పటివరకు 24 సినిమాలను పూర్తి చేశాడు. ప్రస్తుతం తను నటిస్తున్న 25 వ చిత్రం సెట్స్ పై ఉంది. అదే ‘మహర్షి’.
జూనియర్ ఎన్టిఆర్
అసలు 25 చిత్రాల ల్యాండ్ మార్క్ అనేది మొదటగా ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ద్వారా మొదలైంది. 2001 లో ‘నిన్ను చూడాలని’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన తారక్ .. 2016 లో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో 25 చిత్రాలను పూర్తిచేసుకున్నాడు.
గోపీచంద్
కెరీర్ మొదట్లో విలన్ గా టర్న్ తీసుకోవడంతో గోపీచంద్ కు 25 సినిమాలు కంప్లీట్ అయ్యేటప్పటికి 17 ఏళ్ళు పట్టింది. ‘పంతం’ సినిమా గోపీచంద్ 25 వ సినిమా.
నితిన్
2002 లో ‘జయం’ సినిమాతో హీరోగా పరిచయమై సక్సెస్ అందుకున్న నితిన్ .. ‘చల్ మోహన రంగ’ సినిమాతో 25 చిత్రాల ల్యాండ్ మార్క్ ను దాటాడు.
సుమంత్
1999 లో ‘ప్రేమ కథ’ సినిమా ద్వారా సక్సెస్ అందుకున్న సుమంత్ .. ప్రస్తుతం వైవిధ్యభరిత కథలకు ప్రాధాన్యతనిస్తున్నాడు. ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాతో 25 సినిమాల ల్యాండ్ మార్క్ అందుకున్నాడు.
పవన్ కళ్యాణ్
1996 లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ స్థాయికి ఎదిగి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ‘అజ్ఞాతవాసి’ సినిమా 25 వ సినిమా.