నాగబాబు ఘోర ఓటమి… రోజా గెలుపు… జబర్దస్త్ పరిస్థితి ఏమిటి?
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం తెచ్చాయి. తెలుగుదేశం ఘోర పరాజయం చవిచూసింది. ఇక గత ఎన్నికల్లో టిడిపి,బిజెపిలకు సపోర్ట్ చేసిన జనసేన ఇప్పుడు బరిలో నిల్చింది. బీఎస్పీ,వామపక్షాలతో కల్సి పోటీ చేసిన జనసేన కేవలం ఒక్కసీటుకే పరిమితం అయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం,గాజువాక లలో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఈ రెండు చోట్లా వైసీపీ అభ్యర్థులు గెలిచారు. పవన్ రెండో స్థానానికి పరిమితం అయ్యారు. దీంతో కింగ్ మేకర్ అవుదామునుకున్న పవన్ కలలు కల్లలు అయ్యాయి.
కాగా నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగిన మెగా బ్రదర్ నాగబాబు ఓటమి పాలయ్యాడు. ఇక్కడ వైసిపి అభ్యర్థి రఘురామ కృష్ణం రాజు గెలవగా, టిడిపి అభ్యర్థి శివరామరాజు రెండవ స్థానంలో నిలిచారు. నాగబాబు మూడవ స్థానానికి వెళ్లిపోవాల్సి వచ్చింది. మెగా బ్రదర్స్ ఇద్దరూ ఓటమి పాలవ్వడంతో జనసేన శిబిరంలో నిరాశ నెలకొంది. ఇక వైస్సార్ సిపిలో గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన రోజా ఇప్పుడు నగరి నుంచి మరోసారి పోటీ చేసి విజయం సాధించింది. గత ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమ నాయుడుపై రోజా గెలవగా, ఈసారి స్వర్గీయ ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు భానుప్రకాష్ పై విజయం సాధించింది.
నిజానికి ఈసారి ఎన్నికల్లో రోజా ఓటమి ఖాయమని ప్రత్యర్ధులు వ్యూహం పన్నినా తనదే గెలుపంటూ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చింది. అందుకే రోజా ఆనందంతో స్పందిస్తూ,’ఒకప్పుడు ఐరెన్ లెగ్ అంటూ వెటకారించిన వాళ్లకు నా విజయమే సమాధానం, నాది గోల్డెన్ లెగ్’అని పేర్కొంది. ఎన్ని జిమ్మిక్కులు చేసినా మహిళలు ఈ ఎన్నికల్లో చంద్రబాబుకి సరైన గుణపాఠం చెప్పారని పేర్కొంది. ఇక టివి షో జబర్దస్త్ ప్రోగ్రాం లో జడ్జీలు గా పనిచేసే రోజా, నాగబాబు మంచి ఫ్రెండ్స్. అయితే రోజా ఈ ఎన్నికల్లో గెలవగా, నాగబాబు ఓటమి పాలయ్యాడు. అయితే పోలింగ్ తర్వాత గ్యాప్ లో జబర్దస్త్ ప్రోగ్రాం కి వచ్చిన రోజా,ఇప్పుడు నెగ్గడం,మంత్రి పదవి ఖాయమని తెలియడంతో మరి జబర్దస్త్ ప్రోగ్రాం కి వస్తుందా లేదా అనేది తేలాలి.