చిరంజీవికి ,ధూళిపాలకు మధ్య సంబంధం ఏమిటో తెలుసా ?
నాటక రంగంలో ప్రాణంగా జీవించిన సినీ నటుడు ధూళిపాళ సీతారామ శాస్త్రి ఎన్నో విశిష్ట పాత్రలు పోషించి జన హృదయాల్లో నిలిచారు. శకుని పాత్రకు అచ్చంగా సరిపోయిన వ్యక్తి గా తనదైన ముద్ర వేసిన ప్రతిభాశాలి. 1922లో గుంటూరు జిల్లా దాచేపల్లిలో జన్మించిన ధూళిపాళ ఎన్నో సినిమాలను వదులుకుని నాటకరంగంలోనే ఉండిపోయారు. చివరకు నాటకరంగ గురువు సూచన మేరకు భీష్మ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఎన్నో పౌరాణిక పాత్రల్లో ఒదిగిపోయిన ధూళిపాళ తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్రవేశారు. నటరత్న నందమూరి తారక రామారావు శిష్యుడైన ధూళిపాళ చాలా ఆలస్యంగా వెండితెరకు వచ్చారు. భీష్మ సినిమాతో ఏర్పడిన పరిచయంతో ఇద్దరి మధ్యా గురుశిష్య బంధం గా మారింది.
ఎన్టీఆర్ పౌరాణిక సినిమాలు అన్నింటిలోనూ నటించారు. ధూళిపాళ డైలాగ్ డెలివరీకి ఎన్టీఆర్ ఫిదా అయ్యేవారట. దాదాపు 350కి పైనే చిత్రాల్లో నటించి తెలుగు ఆడియన్స్ ని ధూళిపాళ మెప్పించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తో కల్సి ఒకేఒక మూవీలో ధూళిపాళ నటించారు. అదే ఆయన చివరి చిత్రం. అయితే ఆ చిత్రంతో ఇద్దరి మధ్యా మంచి అనుబంధం ఏర్పడింది. సినిమాల పరంగా కన్నా ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఇద్దరూ ఆంజనేయ స్వామి భక్తులే కావడం విశేషం. చనిపోవడానికి ముందు 10ఏళ్లకు పూర్వమే కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి సమక్షంలో ఆయన సన్యసించారు.
శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతి స్వామి పేరుతొ శేష జీవితం గడిపిన ధూళిపాళ గుంటూరు మారుతి దేవాలయం నిర్మించి అక్కడే ఉండిపోయారు. ధూళిపాళ ట్రస్ట్ పెట్టి నిత్యా అన్నదానం వంటి కార్యక్రమాలుచేసేవారు.
ఇక ఆయన నిర్మించిన ఆలయంలో కోరిన కోర్కెలు తీరతాయని ప్రచారం జరగడంతో సామాన్యులతో పాటు ప్రముఖులు వచ్చి దర్శించుకునేవారు. అలాగే చిరంజీవి కూడా అక్కడికి రావడం మొదలు పెట్టడంతో ఇద్దరి మధ్యా అనుబంధం పెరిగింది. ఆలయానికి సాయం కూడా అందించి,తన సినిమాలో చిన్న పాత్ర చేయాలని ధూళిపాళను చిరంజీవి అభ్యర్ధించారు. అయితే ధూళిపాళ ఒప్పుకోకపోవడంతో సినిమాలలో వచ్చిన డబ్బుని ఆలయ సేవకు వినియోగించవచ్చని చెప్పడంతో చివరకు ఒప్పుకుని, చూడాలని ఉంది మూవీలో విలన్ ప్రకాష్ రాజ్ తండ్రిగా కనిపించి,ఆధ్యాత్మిక వేత్తగా దర్శనమిచ్చారు. ఇక ఆతరువాత సినిమాలు వదిలేసి ఆలయానికి అంకితం అయ్యారు.