Movies

వందల కోట్ల సినిమాలో మైనస్ పాయింట్స్ చెప్పేసిన పరుచూరి… ఏ సినిమాయో తెలుసా?

తెలుగు సినీ చరిత్రలో పరుచూరి బ్రదర్స్ కి ఓ విశిష్ట స్థానం ఉంది. టాలీవుడ్ లో కొన్ని వందల సినిమాలకు రచయితలుగా వ్యవహరించడంతో పాటు ఇప్పటికి స్టార్ హీరోల సినిమాలకు రచన సహకారం అందించి పరుచూరి సోదరులు విజయాలు అందుకున్నారు. ఈ బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ అయితే మరీ క్రేజ్ తెచ్చుకున్నారు. గోపాలకృష్ణ యూట్యూబ్ ద్వారా తాము గతంలో పని చేసిన సినిమాలకు సంబంధించిన విషయాలను, ఇతర హీరోల సినిమాలను విశ్లేషిస్తూ వస్తూ ఉంటారు. తాజాగా మహేష్ బాబు 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహర్షి చిత్రం పై కామెంట్స్ చేసారు. 100 కోట్ల వసూళ్లను దక్కించుకు న్న ఈ మూవీ ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వినీదత్ లు నిర్మించారు.

ఈ చిత్రంలోని కొన్ని లోపాలను పరుచూరి గోపాలకృష్ణ ఎత్తి చూపిస్తూ, ప్రధానంగా ఈ సినిమా మైనస్ నిడివి. మూడు గంటల నిడివి ఉన్న ఈ సినిమా ఇంకాస్త ఎడిట్ చేసి ఉంటే బాగుండేదేమో అని పేర్కొన్నారు. ‘గతంలో ఇంద్ర సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత నిడివి కాస్త తగ్గిస్తే బాగుంటుందని అనుకున్నాం. అయితే ఒక్క సీన్ కూడా తీసేయకుండా సీన్స్ లోని ఫ్రేమ్స్ ను తీసి వేస్తూ సినిమాను పది నిమిషాలు తగ్గించాం. మహర్షి చిత్రంలో కూడా నిర్మాత దిల్ రాజు మరియు వంశీలు ప్రయత్నిస్తే 10 నుండి 15 నిమిషాల వరకు తగ్గించే అవకాశం ఉంది. అప్పటికే తగ్గించి అలా ఉంచారో లేదంటే ఉన్నా పర్వాలేదని వారు అనుకున్నారో తెలియదు కాని నిడివి విషయంలో ఇంకాస్త శ్రద్ద తీసుకుని ఉండాల్సింది’అని పేర్కొన్నారు.’ఈ చిత్రం కథ క్రైమ్ అండ్ పనిష్మెంట్ జోనర్ లోకి వస్తుంది. స్నేహితుడి వల్ల జీవితం కాపాడబడ్డ హీరో ఆ విషయాన్ని తెలుసుకోవడంలో చాలా ఆలస్యం అయ్యింది. ఆ విషయాన్ని చెప్పేందుకు ముక్కు ఎక్కడ అంటే తల చుట్టు తిప్పనట్లుగా స్క్రీన్ ప్లే సాగింది. స్నేహితుడి పాత్రను ఇంకాస్తలో లోపం కనిపించింది’అని పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు. ‘ ఇక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ఆరిజోన్ ను ఒక పల్లెటూరులో పెట్టడం అది కూడా ఒక చెట్టు కింద సెటప్ చేయడం సహజత్వంకు చాలా దూరంగా ఉంది. 

పల్లెటూరుకు హెలికాప్టర్ల మీద వచ్చి హీరోను కలవడం ప్రేక్షకులు కాస్త జీర్ణించుకునే విధంగా లేదు. ఆ ఆఫీస్ ఏదో హీరో స్నేహితుడి ఇంట్లో ఏర్పాటు చేస్తే కాస్తలో కాస్త అయినా బెటర్ మెంట్ ఉండేది. ఏది ఏమైనా సినిమా మంచి హిట్ అయ్యింది. పై విధంగా చేస్తే ఫలితం ఎలా ఉండేదో చెప్పలేము. ఏ సినిమా ఎందుకు ఆడుతుందో అనే విషయాన్ని ఎవరూ చెప్పలేరు. ప్రేక్షకులు ఎలాంటి సినిమాను ఇష్టపడతారో వారి అభిరుచి ఎలా ఉంటుందో ఆ సమయం వరకు తెలీదు’అని పరుచూరి వ్యాఖ్యానించారు.