Movies

సునీల్ మోసం చేశాడన్న ఆకాష్ …సునీల్ ఆలా చేశాడా అయ్యో…!

ఇండస్ట్రీలో హిట్ వచ్చినా ఒక్కొక్కరికి కెరీర్ సడన్ గా డౌన్ అవుతుంది. ఫలితంగా చాలా తక్కువ కాలంలోనే కేరీర్ ముగిసిపోతుంది. అందులో హీరో ఆకాష్ ఒకడు. ఆనందం’ చిత్రంతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు దక్కించుకున్న యితడు తొలి చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో కెరీర్ పరంగా చాలా ఉన్నత స్థితికి వెళ్తాడని అందరూ భావించారు. అయితే కొన్ని తప్పుడు నిర్ణయాల వలన ఆకాష్ కెరీర్ చాలా తక్కువ కాలంలోనే ముగిసిందని చెప్పక తప్పదు. ఎందుకంటే, హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా కూడా ప్రయత్నాలు చేసినా సరే,అతడికి కాలం కలిసి రాలేదు.చాలా ఏళ్లు కనిపించకుండా పోయి అంతా మర్చి పోతున్న సమయంలో మళ్లీ మీడియా ముందుకు వచ్చి ఏదో సినిమా అంటూ ప్రకటించి తానేమిటో గుర్తు తెచ్చాడు.

ఆమద్య ఇస్మార్ట్ శంకర్ చిత్రం సమయంలో ఆ కథ నాది నేను సినిమా తీశా విడుదలకు సిద్దం చేస్తున్నా’ అంటూ మీడియా ముందుకు వచ్చి ఆకాష్ వివాదం చేయబోయాడు. అయితే సినిమా విడుదల తర్వాత ఏం జరిగిందో ఏమో కాని సైలెంట్ అయ్యాడు. తాజాగా సునీల్ ,రవితేజల పై మీడియా ముందు ఆకాష్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలో నన్ను చాలా మంది వాడుకుని వదిలేశారంటూ ఆకాష్ అన్నాడు. అందాల రాముడు సినిమా షూటింగ్ సమయంలో సునీల్ నా వద్దకు వచ్చి గెస్ట్ రోల్ కోరడంతో, తాను సరేనని చేశాను. సినిమా మంచి విజయం సాధించింది. సినిమా సక్సెస్ వేడుకలో నన్ను భాగస్వామ్యం చేయకపోవడంతో పాటు, కనీసం అక్కడ నా పేరును కూడా ప్రస్తావించలేదు. సునీల్ నన్ను మోసం చేసాడు’అని ఆకాష్ అన్నాడు.

‘ఇక ఇండస్ట్రీలో నాకు స్నేహితుడు అంటే ఒక్క రవితేజ మాత్రమే. మేమిద్దరం కెరీర్ ఆరంభంలో కలిసి నటించాం. ఆ కారణంగానే ఇప్పటికి కూడా రవితేజ నన్ను అభిమానంతో పలకరిస్తాడు. మేమిద్దరం ఇప్పటికి స్నేహంగా ఉంటున్నాం. ఇండస్ట్రీలో ఒక హీరో ఎదగాలి అంటే ఇంకో హీరోను ఖచ్చితంగా తొక్కేయాల్సిందే. అలా నన్ను చాలా మంది ఇబ్బంది పెట్టారు’అంటూ ఆకాష్ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ‘నేను రాసుకున్న కథతో పూరి ఇస్మార్ట్ శంకర్ సినిమా తీశాడు. సినిమా విడుదలకు ముందు ట్రైలర్, టీజర్ చూసి ఉంటే అప్పుడే కోర్టుకు వెళ్లే వాడిని. నేను సినిమాను అడ్డుకోవాలి అంటే సినిమా విడుదల రోజునైనా కోర్టులో కేసు వేస్తే, మరోలా ఉండేది. అసలు కలెక్షన్స్ ఇన్ని వచ్చి ఉండేవా’అని ప్రశ్నించాడు.