Movies

మరో రంగంలోకి అడుగు పెడుతున్న అక్కినేని కోడలు…చైతూ ఒప్పుకున్నాడా…???

మనపెద్దలు ఎందుకు చెప్పారో ఏమో గానీ దీపం ఉండగానే చక్కదిద్దుకోవడం అనే విషయాన్ని మన సెలబ్రిటీ లు బాగానే పాటిస్తున్నారు. సినిమా కెరీర్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు కాబట్టి ప్రత్యామ్నయంగా సొంతంగా బిజినెస్ లు చేస్తుంటారు. సినిమాల్లో సంపాదించిన సొమ్ముని కొందరు సినిమాల్లోనే పెట్టుబడులుగా పెడుతుంటే, ఇక రెస్టారెంట్లు, జిమ్ములు, హోటళ్లు, పబ్బులు, బొటిక్ ఇలా మహానగరాల్లో రన్ చేస్తోన్న సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు.హీరోలు,హీరోయిన్లు,

దర్శకులు, నిర్మాతలు రక రకాల వ్యాపారాల్ని ఎంచుకుని రాణిస్తున్నారు.సినిమాల ద్వారా వచ్చే లాభాలను వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. తాజాగా అక్కినేని కోడలు సమంత కెరీర్ బెస్ట్ ఫేజ్ లో ఉండగానే వ్యాపార రంగం వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సినిమాలు తగ్గించి, నిర్మాతగా తొలి అడుగులు వేస్తోంది. అలాగే బుల్లితెర డిజిటల్ ఎంట్రీపైనా పక్కా ప్రణాళికా బద్ధం గా దూసుకెళుతోంది. `ఫ్యామిలీ మేన్ -2` అనే వెబ్ సిరీస్ లో సమంత నటించింది. డిజిటల్ ప్లాట్ ఫాం పై కూడా సక్సెసవ్వాలనే ఉద్ధేశంతోనే తెలివిగా సినిమాలు తగ్గించి ఇటు వైపు గా వెళుతోంది. భవిష్యత్ డిజిటల్ దే కాబట్టే, ముందుగానే తనని పరిచయం చేసుకుంటోంది.

అలాగే ఇతరత్రా బిజినెస్ ల పైనా సమంత సీరియస్ గానే అడుగులు వేస్తోంది. హైదరాబాద్ కు చెందిన మాజీ మిస్ ఫ్యాషనిస్ట్ శిల్పా రెడ్డి తో కలిసి ప్రీస్కూల్ ప్రారంభిస్తోంది. అందుకోసం ఖరీదైన జూబ్లీ హిల్స్ ఏరియా ఎంపిక చేశారట. ప్రీ స్కూల్- నర్సరీ, ప్రైమరీ స్కూల్, పీపీ-2 స్కూళ్లను అధునాతనంగా ప్రారంభించా లన్నది ప్లాన్. ఇప్పటికే `ఏకం` అనే టైటిల్ ని ఎంపిక చేశారు. ఈ స్కూల్స్ లో పిల్లకు పర్యావరణంపైనా అవగాహనకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. పిల్లల వయసును బట్టి వివిధ రకాల కోర్సులను ప్రవేశ పెట్టనున్నారు. హైదరాబాద్ లోనే ది బెస్ట్ స్కూల్స్ గా చేయాలనీ చూస్తోంది. చైతూ విదేశాల్లో బిజినెస్ స్టడీస్ పూర్తి చేసాడు. అతడి సలహా మేరకే సమంత ఇలా ఇన్నోవేటివ్ గా ప్రయత్నిస్తోందా? సొంత ఐడియా తో ముందుకెళుతోందా? అన్నది తెలియాల్సి ఉంది. .