Movies

రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు ఒకే సినిమాలో నటిస్తున్నారా…?

శివానీ- శివాత్మిక సిస్టర్స్ ఇటీవల సోషల్ మీడియాలో యమ స్పీడ్ గా దూసుకెళ్తున్నారు. రెగ్యులర్ ఫోటోషూట్లతో హీట్ పెంచుతూనే ఉన్నారు. ప్రస్తుతం అక్కా చెల్లెళ్ల కెరీర్ పై పేరెంట్స్ చాలా సీరియస్ గా ప్రణాళికల్ని వేస్తున్నారు. జీవిత- రాజశేఖర్ కుమార్తెలు గా శివానీ- శివాత్మిక సిస్టర్స్ సినీ కెరీర్ జర్నీ విషయానికొస్తే, అక్క కంటే ముందే శివాత్మిక ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దొరసానిగా నటించి మెప్పించింది. ప్రస్తుతం కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న `రంగమార్తాండ`లో ఓ ఇంపార్టెంట్ పాత్రలో నటిస్తోంది.

ఇక శివానీ నటించిన తొలి సినిమా రకరకాల కారణాలతో రిలీజ్ వాయిదా పడింది.త్వరలో శివానీ-శివాత్మిక కలిసి ఓ చిత్రంలో చేస్తున్నట్లు టాక్. ఆమధ్య యాంగ్రీ హీరో రాజశేఖర్ నటించిన థ్రిల్లర్ మూవీ `గరుడ వేగ` మంచి ఆదరణకు నోచుకుంది. చాలాకాలం తర్వాత పర్వాలేదనిపించుకున్న ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసాక దీనికి సీక్వెల్ లో తీయాలని నిర్ణయించారు. అందులో ఈ సిస్టర్స్ నటిస్తున్నారట. దర్శకుడు ప్రవీణ సత్తారు దర్శకత్వం చేయబోతున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోందట.

ఈ చిత్రంలో సిస్టర్స్ కోసం దర్శకుడు స్పెషల్ రోల్స్ డిజైన్ చేశారని.. వారి హంగామా ఓ రేంజులోనే ఉంటుందని టాక్ .బాలీవుడ్ హిట్ రొమాంటిక్ డ్రామా `2 స్టేట్స్` తెలుగు రీమేక్ ద్వారా శివానీ సినీఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నించినా కుదరలేదు. ఆ సినిమా క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల మధ్యలోనే ఆపేశారు. అయినా శివానీ చాలా పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది. బ్లాక్ బస్టర్ సినిమా గరుడవేగ సీక్వెల్ లో నటిస్తున్నందున అది తనకు ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదని అంటున్నారు. మొత్తానికి ఇండస్ట్రీలో రాజశేఖర్ డాటర్స్ నిలదొక్కుకోడానికి తమవంతు ప్రయత్నాలు ముమ్మరంగానే చేస్తున్నారు.