Movies

ఆఫర్స్ తగ్గిన రకుల్ ఏమి చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఓపక్క ఆఫర్స్ తగ్గడం, మరోపక్క కరోనా మహమ్మారితో లాక్ డౌన్ .. దీంతో చాలామంది హీరోయిన్స్ రకరకాల యాక్టివిటీస్ లో నిమగ్నమవుతున్నారు. ఇక ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ రెండు మూడు సంవత్సరాలు టాలీవుడ్ కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తన నటనతో ఆకట్టుకున్నప్పటికీ కొత్త హీరోయిన్స్ తో పోటీ, ఆడియన్స్ అభిరుచుల్లో మార్పు తదితర కారణాల వలన గత రెండు సంవత్సరాలుగా ఈమెకు ఆఫర్లు తగ్గుతూ వస్తున్నాయి. మళ్లీ షూటింగ్స్ ప్రారంభం అయితే కొత్త ఆఫర్లు వస్తాయో రావో తెలియని పరిస్థితి.

ఈ నేపథ్యంలో సినిమాలపై నమ్మకం తగ్గించుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్ నెమ్మదిగా వ్యాపారం వైపు మెగ్గు చూపుతున్నట్లు ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. వ్యాపారంతో పాటు ఎంబీఏ కూడా చేయాలని రకుల్ నిర్ణయించుకుంది. ప్రస్తుతం విదేశీ యూనివర్శిటీ నుండి ఎంబీఏ పట్టా కోసం ప్రయత్నాలు చేస్తుందట. ఇటీవలే ముంబయి నుండి తన తల్లిదండ్రులు ఉన్న దిల్లీకి వెళ్లింది. అక్కడ తన తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఒక ఇంగ్లీష్ దిన పత్రికతో చెప్పుకొచ్చింది.

ఈ సందర్బంగా ప్రస్తుతం టైంను ఎలా స్పెండ్ చేస్తోందో కూడా రకుల్ చెప్పింది. ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడుపుతూ తన యూట్యూబ్ ఛానెల్ పనులు చక్కబెడుతోందట. ఇదే సమయంలో ఎంబీఏ కూడా చేస్తున్నట్లు పేర్కొంది. హీరోయిన్ గా ఇన్నాళ్లు చేసి చదువుకు దూరం అయిన ఇన్నాళ్లకు కూడా మళ్లీ ఆమెకు ఎంబీఏ చేయాలనే ఆలోచన మంచిదేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.