జబర్దస్త్ నుండి ఆ రెండు టీం లను తప్పించేసారా…?
లాక్ డౌన్ ముందు వరకూ ఎన్ని షోలు వచ్చినా బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో తన హవా సాగించింది. ఈ షో బాగా సక్సెస్ కావడంతో షో తో కెరీర్ ను ఆరంభించి, ఆర్థికంగా స్థిరపడినవాళ్లు, ఆతర్వాత సినిమాలలోకి వెళ్లిన కమెడియన్లు చాలామందే ఉన్నారు. జనాలు ఎప్పుడూ నవ్వుకోవడానికి సిద్ధంగా ఉంటారు అలా నవ్వించడంలో విజయం సాధించబట్టే ఈ షో ఇంత సక్సెస్ అయ్యింది. అయితే కరోనా మహమ్మారితో విధించిన లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని కూడా నిలిచిపోయాయి.
కరోనా కారణంగా సినిమాల షూటింగ్ లతో పాటు సీరియళ్లు, గేమ్, రియాల్టీషోలు, జబర్దస్త్ కూడా ఎక్కడివక్కడ గప్ చిప్ అన్నట్లు ఆగిపోయాయి. లాక్ డౌన్ సడలింపులతో ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం షూటింగ్ లకు, టీవీ షో లకు అనుమతి ఇచ్చింది. దీంతో జూన్ 25 గురువారం కోసం రాబోయే జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేసారు. ప్రస్తుతం జబర్దస్త్ షో మళ్ళీ ముందుకు దూసుకువెళ్తుందని టాక్.
అయితే మంచి పెర్ఫార్మన్స్ లేని కమెడియన్ లను షో నుండి తొలగించాలని మల్లెమాల బృందం చూస్తున్నట్లు ఓ వార్త కొన్ని రోజుల నుండి వైరల్ అవుతూ వస్తోంది. ఇప్పుడు కొత్త ప్రోమో చూస్తే అదే నిజం అనిపిస్తుంది. మొత్తం ఇప్పుడు ఆరు టీం లు ఉన్నాయని అనసూయ ప్రోమో లో అన్నారు. అలాగే చివర్లో వెంకీస్ మంకీస్ టీం లో కూడా “అలాంటి పంచ్ లు వేసినందుకు ఆ రెండు టీం లు పోయాయి” అన్నారు. తాగుబోతు రమేష్ టీం లో కూడా ఆ రెండు టీంల నుండి తీసేస్తే ఇక్కడికి వచ్చాము అని జీవన్, శాంతి కుమార్ అన్నారు. దీన్ని బట్టి రెండు టీమ్ లు తొలగించేసారా అన్పిస్తోంది. కానీ షో తర్వాత క్లారిటీ రావాల్సి ఉంది.