ఛార్మి పూరి గురించి అసలు విషయాన్నీ చెప్పి షాక్ ఇచ్చింది
పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అన్న టైటిల్ తో ఒక సినిమాని రూపొందిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తుండగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ముంబై, గోవా, బ్యాంకాగ్ లలో చేయాల్సిన సీన్స్ ని హైదరాబాద్ నేపథ్యంగా కీలక మార్పులు చేశారని న్యూస్ వేగంగా చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విషయంలో నిర్మాతల్లో ఒకరైన ఛార్మి క్లారిటి ఇచ్చేసింది.
ఇప్పటి వరకు పూరి ఫైటర్ అన్న స్క్రిప్ట్ లో ఎలాంటి మార్పులు చేయలేదని ..అసలు అంతక ముందు రాసిన స్క్రిప్ట్ ని టచ్ చేయలేదని సోషల్ మీడియాలో వస్తున్నవన్ని రూమర్స్ అంటూ ఛార్మి స్పష్టత ఇచ్చింది. బాక్సింగ్ బ్యాడ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ముంబై తో పాటు బ్యాంకాగ్, గోవాలోను చిత్రీకరణ జరిపేలా పూరి ముందుగానే స్క్రిప్ట్ సిద్దం చేసుకున్నాడు.
ముంబై లో కొంత భాగం చిత్రీకరణ జరిపిన అనంతరం కరోనా మహమ్మారితో విధించిన లాక్ డౌన్ తో పూరి టీం షూటింగ్ నిలిపివేసి హైదరాబాద్ వచ్చేశారు. ఇక ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న పూరి కథ రాస్తూ కూర్చోవడంతో అది కూడా బాలకృష్ణ కోసం అని అంటున్నారు. ఇప్పటికే ఇద్దరి మద్య కథా చర్చలు జరిగాయని అంటున్నారు. కాని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పూరి విజయ్ దేవరకొండ తో తెరకెక్కిస్తున్న సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేశారని వార్తలు వస్తున్నాయి.