MoviesTollywood news in telugu

ఈ ఫొటోలో నిలబడి ఉన్న వ్యక్తిని గుర్తు పట్టారా…అయితే ఆలస్యం చేయకుండా వెంటనే చూసేయండి

మాటే మంత్రం .. అవును దీనిగురించి ఓ పాట కూడా ఉంది. ఇక టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలకు కూడా జన హృదయాలు కదులుతాయి. అందుకే ఇప్పటి వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రాలలోని పవర్ ఫుల్ డైలాగులు చాలామంది సినీ అభిమానులు సమయ సందర్భాలను బట్టి వల్లి వేస్తుంటారు.

మొన్న సంక్రాంతికి బన్నీతో ‘అలవైకుంఠపురంలో’ మూవీతో బ్లాక్ బస్టర్ కూడా అందుకున్నాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రానికి దర్శకత్వం వహించడానికి రంగం సిద్ధం కావడం, ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తున్నట్లు గతంలో అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగిపోయాయి.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా షూటింగులు వాయిదా పడడంతో ఈ చిత్ర విడుదల కూడా వాయిదా పడుతుందా , శరవేగంగా షూటింగ్ నిర్వహించి అనుకున్న సమయానికి విడుదల చేస్తాడో అనేది పక్కన పెడితే, అప్పట్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన “అతడు” అనే చిత్రం గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా చెప్పనవసరం లేదు.

ఇక ఈ చిత్ర షూటింగ్ సమయంలో హీరో మహేష్ బాబు , కమెడియన్ సునీల్ లకు సన్నివేశాలను వివరిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ చిత్రం విడుదలయి దాదాపుగా 15 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఈ చిత్రంలో క్లైమాక్స్ లో మహేష్ బాబు “అబద్ధం చెప్పాను.అబద్ధం మాత్రమే చెప్పాను… అంతేకానీ మోసం చేయాలనుకోలేదు” వంటి ఎన్నో డైలాగులు ఇప్పటికీ చాలామంది బాగానే గుర్తుంటాయి. ప్రస్తుతం మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రతి సినిమాలో తన మార్క్ చూపిస్తూ ఉంటాడు త్రివిక్రమ్.