Movies

తేజ సినిమా నుంచి కాజల్ అవుట్….కీర్తి ఇన్….కారణం స్టార్ హీరో?

చిత్రం మూవీతో టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టించిన క్రియేటివ్ డైరెక్టర్ తేజ ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకుని మంచి పనే చేసాడని ఎందరో అనుకున్నారు. ఇక ‘సీత’ సినిమా ఆశించినంత విజయం అదించకపోవడంతో కొంచెం గ్యాప్ తీసుకుని ఇటీవల రెండు చిత్రాల్ని ప్రకటించారు. ఆ రెండు సినిమాలు ‘రాక్షస రాజు రావణాసురుడు’, ‘అలిమేలు మంగ వెంకట రమణ’ అనే టైటిల్స్ తో తెరకెక్కించబోతున్నట్లు వెల్లడించారు. ఇక ‘అలమేలు మంగ వెంకటరమణ’ సినిమాలో హీరోగా యాక్షన్ హీరో గోపీచంద్ ని సెలెక్ట్ చేసారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ – అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా తీసే, ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని అనుకున్నారు. కానీ కాజల్ ఈ సినిమా నుంచి విత్ డ్రా అయినట్లు మళ్ళీ టాక్.

అసలు ఎందుకిలా జరిగిందంటూ నెట్ లో కామెంట్స్ ఊపందుకున్నాయి. నిజంచెప్పాలంటే, ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్ కి కాజల్ పరిచయమైంది. ఆ మూవీ తేజ తెరకెక్కించిందే. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు అందిపుచ్చుకోవడంతో తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ, భారీ రెమ్యునరేషన్ తీసుకుంటోంది. అంతేకాదు, తేజ దర్శకత్వంలో ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘సీత’ సినిమాల్లో హీరోయిన్ గా కూడా కాజల్ నటించడంతో ‘అలిమేలు మంగ వెంకట రమణ’ లో కూడా కాజల్ నే తీసుకోవాలని తేజ భావించారట. అయితే కాజల్ ఈ సినిమా కోసం భారీగా డబ్బు అడగడంతో ప్రొడ్యూసర్స్ నో చెప్పడంతో కాజల్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు టాక్.

దీంతో ‘అలమేలు మంగ వెంకట రమణ’ చిత్రంలో కీర్తి సురేష్ తీసుకున్నారని తెలుస్తోంది. కాగా కీర్తి సురేష్ కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తన రెమ్యునరేషన్ తగ్గించుకోవడంతో కాజల్ ని పక్కన పెట్టి కీర్తి ని తేజ సినిమాకు తీసుకున్నారట. అంతేకాకుండా ‘మహానటి’ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ఎంపిక పట్ల చిత్ర యూనిట్ సంతృప్తిగా ఉన్నారట. ప్రస్తుతం నితిన్ ‘రంగ్ దే’ , ‘గుడ్ లక్ సఖీ’ అనే సినిమాల్లో కీర్తి సురేష్ నటిస్తోంది. అంతేకాకాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలో కూడా ఒకే అయింది.