Healthhealth tips in telugu

ఫ్రూట్స్ తిన్నాక మంచి నీటిని తాగుతున్నారా…ప్రమాదంలో పడినట్టే

Fruits Benefits in telugu :అవును. ఏవైనా పండ్లు తిన్నాక చాలామంది మంచినీళ్ళు తాగుతుంటారు. కానీ అది ఎంతమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. భోజనానికి ముందు గానీ తినేప్పుడు లేదా తిన్న వెంటనే మంచి నీళ్లు తాగొద్దని పెద్దలు చెబుతుంటారు. నీరు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే నీరు తాగడం వల్ల ఆహారం త్వరగా పేగుల్లోకి చేరుకుంటుంది. ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. కొన్ని రకాల ఆహారం తీసుకున్నాక.. నీటిని తాగడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

* వేసవికాలం మనం ఎక్కువగా పుచ్చకాయలు తీసుకుంటాం. పుచ్చకాయ ముక్కలు తిన్న వెంటనే కొంతమంది నీళ్ళు తాగేస్తారు. ఇలా చేస్తే కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. ఆహారాన్ని , జీర్ణం కావడాన్ని నీరు ఆలస్యం చేస్తుంది. ఎందుకంటే ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడే జఠర రసాలు పెరిగిపోతాయి.

*అరటి పండు తిన్న తర్వాత మంచి నీళ్లు తాగొద్దని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చల్లటి నీరు అసలు తాగకూడదు. ఇలా చేస్తే తీవ్రమైన అజీర్తి సమస్య తలెత్తుందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అరటి పండు తిన్నాక పావు గంట తర్వాతే నీళ్లు తాగాలి.

*పల్లీలు తిన్నాక మంచినీళ్లు తాగకపోవడమే మంచిది. పల్లీల్లో నూనె మోతాదులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తినగానే నీటిని తాగడం వల్ల ఆహారనాళంలో కొవ్వులు పేరుకుపోతాయి. వీటికారణంగా దగ్గు, గొంతు మంటకు ఇది దారి తీస్తుంది.

* నిమ్మజాతి పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. వీటిని తిన్నాక.. నీటిని తాగడం వల్ల పొట్టలో పీహెచ్ స్థాయిల్లో మార్పులు వస్తాయి. ఫలితంగా ఎసిడిటీ, అజీర్ణం, గ్యాస్ ఏర్పడటం లాంటి సమస్యలు తలెత్తుతాయి.

* పాలు తాగిన వెంటనే నీరు తాగడం అస్సలు చేయకూడదు. దీనివల్ల జీర్ణక్రియలో మార్పులు వస్తాయి. కడుపునొప్పిగా అనిపిస్తుంది.