రోజుకి 2 స్పూన్స్ తింటే రక్తహీనత,కీళ్లనొప్పులు,అలసట,నీరసం,నిసత్తువ అనేవి ఉండవు
Saggubiyyam Health benefits in Telugu :సగ్గుబియ్యం అంటే మనలో చాలా మందికి తెలుసు. సగ్గుబియ్యం మన ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వాటిలో ఉండే పోషకాలు మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. సగ్గుబియ్యంలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.
ప్రతిరోజు రెండు స్పూన్ల సగ్గుబియ్యం తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. సగ్గుబియ్యంను ఉడికించి మజ్జిగ ఉప్పు వేసి తీసుకోవచ్చు లేదా సగ్గుబియ్యంను ఉడికించి దానిలో పాలు బెల్లం కలిపి తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వలన ఎముకలు మరియు కండరాలు దృఢంగా మారుతాయి. అంతేకాకుండా అధిక బరువు సమస్య కూడా తొలగిపోతుంది.
పొట్టకు సంబంధించిన సమస్యలు ఏమి ఉండవు. గ్యాస్, కడుపు ఉబ్బరం., అజీర్ణం వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. గర్భిణీ స్త్రీలకు కూడా మంచిది. పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తప్రసరణ బాగా జగడమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉండి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు.
అలసట నీరసం నిస్సత్తువ ఉన్న సమయంలో ఈ సగ్గుబియ్యంతో తయారుచేసిన జావను తీసుకుంటే వెంటనే నూతన ఉత్తేజం కలుగుతుంది. రక్తహీనతతో బాధపడే వారు ఉడికించిన సగ్గుబియ్యంలో పాలు బెల్లం కలిపి తీసుకుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. కాబట్టి తప్పనిసరిగా మీ రోజువారి డైట్ లో సగ్గుబియ్యం ఉండేలా చూసుకోండి.
చాలా తక్కువ ఖర్చులో ఎన్నో పోషకాలను అందించే సగ్గుబియ్యంను రెగ్యులర్ డైట్ లో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అన్నీ వయస్సుల వారు తినవచ్చు. ఉదయం సమయంలో తీసుకుంటే రోజంతా హుషారుగా ఉంటారు. సగ్గుబియ్యం చాలా విరివిగానే లభ్యం అవుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.