సాధారణ మజ్జిగ కన్నా.. అందులో కొద్దిగా అల్లం, వేయించిన జీలకర్ర పొడి, కరివేపాకు, కొత్తిమీర కలుపుకుని తాగితే జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది.
ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో సాయంత్రం లేదా రాత్రి పూట మజ్జిగ తాగకూడదు. మధ్యాహ్నం భోజనం తర్వాత తాగడం సరైన పద్ధతి.
మజ్జిగలో సాధారణ ఉప్పుకు బదులుగా కొద్దిగా నల్ల ఉప్పు (బ్లాక్ సాల్ట్) లేదా సైంధవ లవణం కలపడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దరిచేరవు.
మజ్జిగలో చిటికెడు ఇంగువ లేదా మిరియాల పొడి వేసుకుని తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత బ్యాలెన్స్ అయ్యి, వర్షాకాల వ్యాధులపై పోరాడే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) వర్షాకాలంలో పేగుల ఆరోగ్యాన్ని కాపాడి, ఫుడ్ పాయిజనింగ్ లేదా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తాయి.
ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం. రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసుల తాజా, సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉన్న మజ్జిగ తాగడం ఎంతో శ్రేయస్కరం.