వర్షాకాలంలో మెరిసే చర్మం కోసం 10 అద్భుతమైన చిట్కాలు
వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల చర్మం త్వరగా జిడ్డుగా మారుతుంది. దీనివల్ల మొటిమలు, ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి ఈ కాలంలో చర్మానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
ముఖంపై పేరుకున్న మురికి, అదనపు జిడ్డును తొలగించడానికి మైల్డ్ ఫేస్ వాష్తో రోజుకు రెండుసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇది చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
చర్మ రంధ్రాలను శుభ్రపరిచి, చర్మం పీహెచ్ (pH) బ్యాలెన్స్ కాపాడటానికి ఆల్కహాల్ లేని టోనర్ లేదా సహజమైన రోజ్ వాటర్ను ఉదయం, సాయంత్రం ముఖానికి రాయండి.
వర్షాకాలం కదా అని మాయిశ్చరైజర్ వాడటం మానొద్దు. చర్మం మరీ జిడ్డుగా అనిపించకుండా ఉండేందుకు ఆయిల్-ఫ్రీ (Oil-free) లేదా వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ను ఎంచుకోండి.
ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ, సూర్యుని అతినీలలోహిత (UV) కిరణాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి బయటకు వెళ్లే ముందు కచ్చితంగా సన్స్క్రీన్ లోషన్ రాయండి.
చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి, ముఖం కాంతివంతంగా మారడానికి వారానికి కనీసం ఒకసారి సున్నితమైన స్క్రబ్తో ఎక్స్ఫోలియేట్ చేయండి.
మెరిసే చర్మం కోసం రెండు స్పూన్ల శెనగపిండిలో కొద్దిగా పసుపు, పాలు లేదా పెరుగు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోండి. 15 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం గ్లో అవుతుంది.
వానాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, మొటిమలు వేధిస్తుంటే.. వేప ఆకుల పేస్ట్లో కొద్దిగా ముల్తానీ మట్టి, గులాబీ నీరు కలిపి ముఖానికి ప్యాక్లా వేసుకోండి. ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ శరీరాన్ని డీహైడ్రేట్ కానివ్వొద్దు. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లిపోయి, చర్మం లోపలి నుండి మెరుస్తుంది.
నూనె పదార్థాలు, జంక్ ఫుడ్కు దూరంగా ఉండండి. విటమిన్-సి ఎక్కువగా ఉండే బత్తాయి, నారింజ లాంటి పండ్లు, తాజా కూరగాయలను మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి.