MoviesTollywood news in telugu

Heroine Laya:స్వయంవరంతో ఎంట్రీ ఇచ్చిన తెలుగు అమ్మాయి లయ ఇపుడు ఏమి చేస్తుందో తెలుసా?

Tollywood Heroine Laya:ఒకప్పుడు టాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకుని, ఆతర్వాత పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న హీరోయిన్ లయ పేరు చెప్పగానే చాలామందికి ఆమె కళ్ళముందు మెదలాడుతుంది. అచ్చమైన తెలుగు అమ్మాయి అయిన లయకు అందం, అభినయం రెండూ వున్నాయి. ఇప్పటికీ తెలుగులో ఇలాంటి హీరోయిన్ లేదంటే నిజంగా ఆశ్చర్యకరం.

అప్పట్లో వరుస సినిమాలతో తెలుగులో తిరుగులేని హీరోయిన్ గా రాణించింది. పెళ్లయ్యాక పూర్తిగా సినిమాలు మానేసి,దూరంగా ఉంటోంది. ఇప్పుడు మరల సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధం అయినట్టు సమాచారం. శ్రీని వైట్ల దర్శకత్వంలో రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో లయ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.

ఆమె పెళ్లయ్యాక అమెరికాలో సెటిల్ అయినా విషయం తెలిసిందే. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ఎక్కువ శాతం అమెరికాలో షూటింగ్ జరుపుకోవటం వలన ఈ సినిమాలో నటించటానికి లయ ఒప్పుకున్నట్టు సమాచారం.

ఇదే సినిమా ద్వారా లయ కూతురు శ్లోకా కూడా టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది. లయ కూడా బాలనటిగానే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. లయ కూతురు కూడా తల్లి బాటలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. 1992లో వచ్చిన ‘భద్రం కొడుకో’ అనే సినిమాతో లయ ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాకి ముందు త్రివిక్రమ్,ఎన్టీఆర్ కాంబినేషన్ లో చేస్తున్న సినిమాకు లయను అడిగితే రిజెక్ట్ చేసిందట. లయ మొదటి సినిమా స్వయంవరం సినిమాకి త్రివిక్రమ్ మాటలు రాసాడు. ఆ పరిచయంతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాలో నటించమని అడిగాడని సమాచారం.

నితిన్ నటిస్తున్న తమ్ముడు సినిమాలో లయ నటిస్తుంది. ఈ సినిమాలో లయ ఒక కీలకమైన పాత్రలో నటిస్తుందని సమాచారం. మంచి పాత్రలు దొరికితే సినిమాల్లో నటించటానికి సిద్దంగా ఉంది.