Movies

ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ గురించి ఈ విషయాలు తెలుసా? నమ్మలేని నిజాలు

బాహుబలితో వరల్డ్ వైడ్ గా అభినందనలు అందుకున్న ప్రభాస్ డిఫరెంట్ సినిమాలతో ప్లాప్ ,హిట్ అనే తేడా లేకుండా తన సత్తా చాటుతూ తారాస్థాయికి చేరాడు. ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి,వర్షంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్ తాజాగా సాహు మూవీలో చేస్తున్నాడు. ఇంకా పెళ్లి కాని ప్రభాస్ పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకి చెందిన ప్రముఖ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు,శివకుమారి దంపతులకు1979 అక్టోబర్ 23న రెండవ సంతానంగా జన్మించాడు. సోదరుడు ప్రబోధ్ , సోదరి ప్రగతి ఉన్నారు. ఇతని పెదనాన్న కృష్ణంరాజు తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా ఎదిగాడు.

ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి ప్రభాస్ రాజు. చిన్ననాటినుంచి చురుగ్గా వుండే ప్రభాస్ భీమవరం డి ఎన్ ఆర్ లో హైస్కూల్ విద్య పూర్తిచేసి చెన్నైలో ఇంటర్ చదివాడు. హైదరాబాద్ శ్రీచైతన్యలో బిటెక్ పూర్తిచేసాడు. సినిమాల్లో ప్రభాస్ దూసుకెళ్తున్న సమయంలో బిల్లా సినిమా తీసిన తండ్రి సూర్యనారాయణరాజు ఆతర్వాత 2010డిసెంబర్ 2న అనారోగ్యంతో చనిపోయారు. ఇక అప్పటినుంచి ప్రభాస్ బాగోగులు అన్నీ కృష్ణంరాజు చూస్తున్నారు.

బాహుబలి తో వరల్డ్ వైడ్ రేంజ్ కి ఎదగడం తన తమ్ముడు చూసి ఉంటే ఎంతోఆనంద పడేవాడని కృష్ణంరాజు అంటారు. 2002లో ఈశ్వర్ తో ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ హిట్ అందుకున్నాడు. 2003లో రాఘవేంద్ర మూవీ ప్లాప్ అయింది. అయితే 2004లో త్రిష సరసన నటించిన వర్షం మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నాడు. అడవిరాముడు,చక్రం మూవీస్ తో నటుడిగా గుర్తింపు లభించింది. 2005లో శ్రేయ సరసన ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు ప్రముఖ నటుడిగా నిలబెట్టింది.

ఆతర్వాత పౌర్ణమి విజయం సాధించింది. అయితే యోగి మూవీ మాత్రం డిజాస్టర్ అయింది. ఆతర్వాత పైడిపల్లి వంశీ డైరెక్షన్ లో ఇలియానా సరసన చేసిన మున్నా హిట్ అయింది. ఇక పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో చేసిన బుజ్జిగాడు మూవీ హిట్ అయింది. ఆతర్వాత మెహర్ రమేష్ డైరెక్షన్ లో బిల్లా సినిమా చేసి హిట్ కొట్టాడు. ఆతర్వాత పూరి డైరెక్షన్ లో చేసిన ఏక్ నిరంజన్ మూవీ లో నటించగా అది హిట్ అవ్వలేదు. అయితే అవార్డు అందుకున్నాడు.

కాజల్ సరసన డార్లింగ్ మూవీ చేసి సరికొత్త హిట్ కొట్టి , ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నాడు. 2011లో మిస్టర్ పర్ ఫెక్ట్ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నాడు. ఆతర్వాత రెబెల్ మూవీ ప్లాప్ అయింది. ఆ తర్వాత బాహుబలి కోసం ఐదేళ్లపాటు శ్రమించి తపించడంతో అది అనూహ్య విజయాన్ని అందుకుంది.
Sahoo Prabhas
రెండు భాగాలుగా జక్కన్న డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి కుంభవృష్టిని కురిపించింది. తెలుగు మూవీకి ఇంతపెద్ద మార్కెట్ ఉంటుందా అని ఆశ్చర్యపరచడమే కాదు, అసలు ప్రభాస్ ఎవరా అని యావత్ ప్రపంచం చర్చించుకుంది. మిర్చి మూవీలో నటించి భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. మిర్చి ఆతర్వాత బాహుబలి మూవీస్ లో తనతో నటించిన అనుష్కతో ప్రభాస్ ప్రేమాయణం సాగిందన్న వార్తలు వచ్చాయి.