ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా… ఎంత సన్నగా అయిపోయిందో…?
మహేష్ బాబు వెంకటేష్ హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీతగా నటించిన తెలుగు అమ్మాయి అంజలి గుర్తుంది కదా. ఆమె తెలుగు కన్నా తమిళ్లో బాగా హిట్ అయింది. కరోనా కారణంగా షూటింగ్ ఏమీ లేకపోవడం వల్ల ఈ అమ్మడు ఇంట్లో ఉండి ఐదు నుంచి పది కేజీల వరకు బరువు తగ్గింది. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలతో ఈ విషయం బయటపడింది.
ఈ లాక్ డౌన్ సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుని నాజూగ్గా తయారైంది. ప్రస్తుతం అంజలి నిశ్శబ్దం అనే సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. OTT ఫ్లాట్ ఫామ్ లో ఈ సినిమాని రిలీజ్ చేయటానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇక ఇప్పుడు బోయపాటి శీను దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయింది అంజలి. తెలుగులో కూడా సక్సెస్ రావాలని కోరుకుందాం.

