ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య ఎన్ని కోట్ల లాభం వచ్చిందో తెలుసా ?
కంటెంట్ ఉంటె ఆడియన్స్ ఆదరిస్తారని తక్కువ బడ్జెట్ తో తీసిన ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య మూవీ నిరూపించింది. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ తెలుగు సినిమా సత్తా చాటిన ప్రొడ్యూసర్స్ శోభు యార్లగడ్డ , ప్రసాద్ దేవినేని ఆతర్వాత పెద్ద బడ్జెట్ పేరుతొ తొందర పడకుండా కంచరపాలెం వంటి చిన్న సినిమా తీసి హిట్ కొట్టిన దర్శకుడు వెంకటేష్ మహా తో కల్సి ఇప్పుడు మలయాళ మాతృక తో ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య తీశారు.
లాక్ డౌన్, కరోనా నేపథ్యంలో ఓ టి టి ద్వారా ఈ సినిమా రిలీజ్ చేసి మంచి ఫలితాన్ని రాబట్టారు. సత్యదేవ్ నటించిన ఈ సినిమా కథ,కధనం నడిపించిన తీరు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. హీరో నటన,డైరెక్టర్ పనితనం ఈ సినిమా చూసేలా ఆడియన్స్ ని ఆకర్షించాయి. నరేష్,సుహాస్,రాఘవన్,హరిచంద్ర,రూప తదితరులు నటించిన ఈ మూవీకి బిజీబల్ సంగీతం అందించాడు. శోభు యార్లగడ్డ , ప్రసాద్ దేవినేనిలతో పాటు విజయ్ ప్రవీణ్ పరుచూరి నిర్మించారు.
ఇక ఈ మూవీకి మంచి రివ్యూస్ కూడా వచ్చాయి. ఎంతోమంది సెలబ్రిటీల ప్రశంసలు కూడా అందుకుంది. ముఖ్యంగా కమర్షియల్ గా కూడా ఈ మూవీ తన సత్తా చాటిచెప్పింది. కోటిన్నర రూపాయలు నెట్ ఫ్లిక్స్ ద్వారా వచ్చిందని,దీంతో బడ్జెట్ ఓటిటి తో వచ్చేసినట్టేనని ట్రేడ్ వర్గాల అంచనా. శాటిలైట్ హక్కులను కూడా ఈటీవికి ఇచ్చినట్లు,దీనివలన మరో కోటిన్నర వచ్చినట్లు టాక్.

