MoviesTollywood news in telugu

బంగారు పంజరం సీరియల్ మహాలక్ష్మి పాత్రను ఎంత మంది రిజెక్ట్ చేశారో?

Bangaru panjaram serial Today :స్టార్ మాలో ప్రసారమవుతూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న బంగారు పంజరం సీరియల్ లో మహాలక్ష్మి పాత్రలో నటిస్తున్న హీరోయిన్ పేరు లిఖితా మూర్తి. కర్ణాటకకు చెందిన లిఖితకు ఇదే తెలుగులో తోలి సీరియల్. అయితే ఈమెను ఈ పాత్రకు సెలెక్ట్ చేయడంతో ఈమె బాగానే నటిస్తూ ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. అయితే ఈ సీరియల్ హీరోయిన్ కోసం ముగ్గురు పాపులర్ హీరోయిన్స్ ని సంప్రదించగా వారు రిజెక్ట్ చేశారు.

ముద్దమందారం సీరియల్ తో అందరికీ దగ్గరైన తనూజ గౌడ పనిమనిషి పార్వతి పాత్రలో బాగా రాణించింది. కర్ణాటకలో యాంకరింగ్, తెలుగులో మూవీస్ కూడా చేసిన ఈమె సీరియల్స్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇక జి తెలుగులో ప్రసారమయ్యే త్రినయని సీరియల్ లో అందరినీ ఆకట్టుకున్న ఆశికా గోపాల్ కి తెలుగులో ఇది రెండవది. మొదటి సీరియల్ కథలో రాజకుమారిలో సీరియల్ తో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చింది.

కన్నడలో నిహారిక సీరియల్ లో ఆశికా గోపాల్ చేసి, అటు కన్నడ, ఇటు తెలుగులో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. జి తెలుగులో గంగ మంగ సీరియల్ తో ఆకట్టుకున్న ప్రణవి మనుకొండ సీరియల్ తో అందరినీ ఆకట్టుకుంది. ఉయ్యాలా జంపాల , సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, రొటీన్ లవ్ స్టోరీ మూవీస్ లో చేసింది. ఎవరే మోహిని, పసుపు కుంకుం, గంగ మంగ సీరియల్స్ లో చేస్తోంది. ఈ ముగ్గురు మహాలక్ష్మి పాత్రను రిజెక్ట్ చేశారు.