IRCTC బంపర్ ఆఫర్: తూర్పు భారత యాత్ర.. రూ.15 వేలకే పూరీ, కాశీ, అయోధ్య సహా 6 పుణ్యక్షేత్రాల దర్శనం!
IRCTC బంపర్ ఆఫర్: తూర్పు భారత యాత్ర.. రూ.15 వేలకే పూరీ, కాశీ, అయోధ్య సహా 6 పుణ్యక్షేత్రాల దర్శనం.. మీ అమ్మానాన్నలను లేదా కుటుంబ సభ్యులను ఒకేసారి దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? ప్రయాణం, బస, భోజనం లాంటి టెన్షన్లు ఏమీ లేకుండా ప్రశాంతంగా దేవుడి దర్శనం చేసుకోవడానికి ఇండియన్ రైల్వేస్ (IRCTC) ఒక బెస్ట్ టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది.
భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు (Bharat Gaurav Tourist Train) ద్వారా ‘పుణ్య క్షేత్ర యాత్ర (Punya Kshetra Yatra)’ పేరుతో ఒక అద్భుతమైన ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీ ద్వారా పూరీ, కోణార్క్, గయ లాంటి తూర్పు భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పాటు కాశీ, అయోధ్యలను కూడా ఒకే ట్రిప్లో దర్శించుకోవచ్చు.
ప్యాకేజీ వ్యవధి & దర్శించే ప్రాంతాలు
ఈ యాత్ర ప్యాకేజీని బట్టి 8 రాత్రులు / 9 పగళ్లు లేదా 9 రాత్రులు / 10 పగళ్ల పాటు సాగుతుంది. ఇందులో కవర్ అయ్యే ముఖ్యమైన క్షేత్రాలు ఇవే:
పూరీ: శ్రీ జగన్నాథ స్వామి ఆలయ దర్శనం.
కోణార్క్: ప్రసిద్ధ సూర్య దేవాలయం మరియు కోణార్క్ బీచ్ సందర్శన.
గయ: పితృకర్మలకు ప్రసిద్ధి చెందిన విష్ణుపాద ఆలయం దర్శనం.
వారణాసి (కాశీ): కాశీ విశ్వనాథ్ కారిడార్, విశాలాక్షి మరియు అన్నపూర్ణ దేవి ఆలయాల దర్శనం.. అలాగే సాయంత్రం కన్నుల పండువగా జరిగే గంగా హారతి.
అయోధ్య: భవ్య రామ మందిరంలో బాలరాముని దర్శనం (రామ జన్మభూమి), హనుమాన్ గర్హీ మరియు సరయూ నది వద్ద హారతి.
ప్రయాగ్రాజ్: పవిత్రమైన త్రివేణి సంగమ స్నానం (కొన్ని ప్యాకేజీల్లో దీనికి బదులుగా జ్యోతిర్లింగమైన బైద్యనాథ్ ధామ్ కూడా కవర్ అవుతుంది).
కేవలం తాగడానికే కాదు.. కాఫీ పౌడర్ తో మీ అందాన్ని ఇలా రెట్టింపు చేసుకోండి! కింద వీడియో చూడండి
తెలుగు రాష్ట్రాల్లో ఈ రైలు ఎక్కడెక్కడ ఎక్కొచ్చు?
తెలుగు రాష్ట్రాల భక్తుల సౌకర్యార్థం ఈ భారత్ గౌరవ్ రైలు మన ప్రధాన స్టేషన్ల మీదుగానే వెళ్తుంది. మీరు ఈ రైలును సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం తదితర రైల్వే స్టేషన్లలో ఎక్కవచ్చు (బోర్డింగ్ పాయింట్స్).
ఈ ప్యాకేజీలో ఏమేం ఫ్రీ? (Inclusions)
మీరు ఒక్కసారి ఈ ప్యాకేజీ డబ్బులు కడితే చాలు, యాత్ర పూర్తయ్యే వరకు మీకయ్యే ప్రధాన ఖర్చులన్నీ ఐఆర్సీటీసీనే భరిస్తుంది:రానుపోను మీరు ఎంచుకున్న క్లాస్ను బట్టి రైలు టికెట్లు.రాత్రి నిద్రపోవడానికి, ఉదయం ఫ్రెష్ అవ్వడానికి గదులు (హోటళ్లు లేదా ధర్మశాలలు).
ఉదయం టీ, బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం మరియు రాత్రికి పూర్తి శాకాహార భోజనం.రైల్వే స్టేషన్ నుంచి గుడులకు, సైట్ సీయింగ్ తీసుకెళ్లడానికి స్థానికంగా ఏసీ/నాన్-ఏసీ బస్సులు. ప్రతి కోచ్కు ఒక టూర్ గైడ్, రైలులో సెక్యూరిటీ గార్డ్ మరియు ప్రయాణికులందరికీ ఉచిత ట్రావెల్ ఇన్సూరెన్స్.
టికెట్ ధర ఎంతంటే? (ఒక్కరికి)
మీరు ఎంచుకునే క్లాస్ మరియు షేరింగ్ (సింగిల్, డబుల్, ట్రిపుల్) ఆధారంగా ధరలు నిర్ణయించారు:
ఎకానమీ (Sleeper Class): అతి తక్కువ బడ్జెట్లో వెళ్లాలనుకునేవారికి ఒక్కరికి సుమారు రూ. 15,100 నుండి రూ. 16,800 వరకు ప్రారంభం అవుతుంది.
స్టాండర్డ్ (3AC): థర్డ్ ఏసీలో ప్రయాణించాలనుకునేవారికి ఒక్కరికి సుమారు రూ. 24,000 నుండి రూ. 26,300 వరకు ఉంటుంది.
కంఫర్ట్ (2AC): సెకండ్ ఏసీ సౌకర్యం కావాలనుకుంటే ఒక్కరికి సుమారు రూ. 31,500 నుండి రూ. 34,300 వరకు ఖర్చవుతుంది.
ఎలా బుక్ చేసుకోవాలి?
మీరు ఆన్లైన్లో IRCTC టూరిజం అధికారిక వెబ్సైట్ irctctourism.com లేదా భారత్ గౌరవ్ స్పెషల్ వెబ్సైట్ bharatgaurav.irctc.co.in లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. ‘Punya Kshetra Yatra’ అని వెతికితే మీకు ఖాళీగా ఉన్న తేదీలు కనిపిస్తాయి, నేరుగా అక్కడే పేమెంట్ చేసి టికెట్ పొందవచ్చు.
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

