Movies

అనుపమ పరమేశ్వరన్ ఎవరి కూతురో తెలుసా…. నమ్మలేని నిజాలు

టాలీవుడ్ లో ఇప్పుడు బాగా వినిపిస్తూన్న పేరు అనుపమ పరమేశ్వరన్. అనుపమ నటిస్తే సినిమా మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకం నిర్మాతల్లో ఏర్పడింది. దాంతో అనుపమను సినిమాల్లో తీసుకోవటానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే అనుపమ కంగారు పడకుండా ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటుంది. శతమానంభవతి,ఉన్నది ఒకటే జిందగీ వంటి సినిమాలతో కెరీర్ మొదట్లోనే భారీ విజయాలను నమోదు చేసుకుంది. నాని హీరోగా వచ్చిన కృష్ణార్జున యుద్ధం నిరాశ పరచిన, అందులో అనుపమ పాత్రకు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో తేజ్ ఐ లవ్ యూ సినిమాతో రానున్నది. స్టార్ హీరోయిన్ గా ఎదగటానికి అన్ని అర్హతలు ఉన్న హీరోయిన్ గా అనుపమను విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు.

చిన్న వయస్సులోనే సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన అనుపమ పరమేశ్వరన్ కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌ జిల్లాకు చెందిన ఇరింజలకుడలో 1996 ఫిబ్రవరి 18 న పరమేశ్వరన్, సునీత దంపతులకు జన్మించింది. అనుపమకు ఒక సోదరుడు ఉన్నాడు. అనుపమ తండ్రి ఖాతర్ లో ఒక ప్రవేట్ సంస్థలో ఉద్యోగం చేసేవారు. ఈమె ప్రాథమిక విద్య పూర్తి చేసిన

తర్వాత కొట్టాయం సి.ఎం.ఎస్. కళాశాలలో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ప్రధాన విషయంగా ఉన్నతవిద్యను అభ్యసించింది. ఆ సమయంలోనే ప్రేమమ్ సినిమాలో అవకాశం రావటంతో చదువుకు బ్రేక్ పడింది. ప్రేమమ్ కి ముందు మలయాళంలో టీవీ షోలు,రియాల్టీ షోలు చేసి బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుంది.

ప్రేమమ్ సినిమాలో నటించటం ఆమె జీవితంలో పెద్ద మలుపు అని చెప్పవచ్చు. సినిమా హిట్ కావటంతో మలయాళంలోనే కాకుండా తమిళ,తెలుగు భాషల్లో కూడా ఛాన్స్ లు వెతుక్కుంటూ వచ్చాయి.

అనుపమకు తన మొదటి సినిమా ప్రేమమ్ అంటే ఎంత ఇష్టం అంటే తాను కొత్తగా నిర్మించుకున్న ఇంటికి ప్రేమమ్ అని పేరు పెట్టుకుంది. ప్రతి FATHERS DAY రోజున తండ్రితో గడపటం అనుపమకు చాలా ఇష్టం. సినిమా షూటింగ్స్ లేకపోతె కేరళ అందాలను చూస్తూ గడిపేస్తుంది.