Movies

సీక్వెల్ సినిమాలకు అసలు మార్కెట్ ఉందా?

అటు బాలీవుడ్ గానీ,ఇటు టాలీవుడ్ గానీ సీక్వెల్ ట్రెండ్ బాగానే ఫాలో అవుతున్నట్టు ఉంది. హిందీలో ధూమ్ వన్, ధూమ్ టు , ధూమ్ త్రీ , అలాగే రేస్ వన్, రేస్ టు , రెస్ట్ త్రీ దుమ్ము రేపగా, తెలుగులో ఆర్య వన్, ఆర్య టు సీక్వెల్స్ అదరగోట్టాయి. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన ఆర్య కు మంచి క్రేజ్ వచ్చింది.

ఆర్య 3కూడా తీద్దామని అనుకున్నా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. ఇక బాహుబలి బిగినింగ్,బాహుబలి కంక్లూజన్ చిత్రాలు తెలుగు సినిమాను వరల్డ్ వైడ్ కి తీసుకెళ్లాయి. ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ వహించిన ఈ మూవీ కోట్ల రూపాయలు కలెక్షన్స్,అవార్డులు కూడా తెచ్చిపెట్టింది.

ఆ మధ్య అంటే 1996లో అవినీతి మీద సమరశంఖం పూరిస్తూ లంచం తీసుకున్న వాడిని అడ్డంగా నరికేయాలన్న కాన్సప్ట్ తో కమల్ హాసన్ హీరోగా వచ్చిన భారతీయుడు అప్పట్లో ఓసంచలనం. కమల్ హాసన్ నటనకు జనం నీరాజనం పట్టారు. ఇక ఇప్పుడు భారతీయుడు -2తీయడానికి రంగం సిద్ధం అయింది. ఇప్పటికే ఈ మూవీపై వచ్చిన పోస్టర్స్ దుమ్ము రేపుతున్నాయి.

ఇక ఈ మధ్య అడవి శేషు తీసిన గూఢచారి సినిమా సెన్షనల్ హిట్ అయింది. ఇప్పుడు దీనికి గూఢచారి 2సీక్వెల్ గా వస్తోంది. ఇక మన్మథుడిగా హిట్ అందుకోవడంతో పాటు నిజంగా మన్మధుడిగానే ఫాన్స్ చేత పిలిపించుకునే నటుడు నాగార్జున మన్మధుడు -2వైపు అడుగులు వేస్తున్నాడు. డైరెక్టర్ గా రాహుల్ రవీంద్రన్ ఫిక్స్ చేశారట. సినిమాకు అనుగుణంగా చాలావరకూ యూరప్ లో షూటింగ్ చేయబోతున్నారట. పాయల్ రాజపుత్ ఇందులో హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు,మరో హీరోయిన్ ని సెలెక్ట్ చేయాలని అనుకుంటున్నట్లు వార్త.అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పర్యవేక్షించబోతున్నాడట.

ఎఫ్ 2మూవీ ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ గా నిలవగా దీనికి సీక్వెల్ గా ఎఫ్ 3చేయాలనీ భావిస్తున్నారట. విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ నటించిన ఈమూవీ నవ్వులు పూయించింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ చేసాడు. దిల్ రాజు నిర్మించనున్న ఎఫ్ 3మూవీ 2020 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే మరో స్టార్ హీరో ఇందులో అదనంగా చేయబోతున్నట్లు టాక్. మరి హీరోయిన్స్ ఎవరన్నది ఆసక్తి పెంచుతోంది.