రోజా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి ఎక్కడికి వెళ్లిందో తెలుసా?
సినీ నటి, ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం నూతన సంవత్సర వేడుకలను దేశంలోని పర్యాటక ప్రాంతం గోవాలో జరుపుకోవాలని చూస్తున్నది. ఈ సందర్భంగా రోజా తన కుటుంబ సభ్యులతో కలసి ఇప్పటికే గోవా చేరుకున్నారు. కొత్త సంవత్సర వేడుకలను ఆమె ఫ్యామిలీ తో కలసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
భర్త, పిల్లలే కాకుండా… మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ఆమె వెంట ఉన్నారు. న్యూ ఇయర్ కు ఆమె అక్కడే ఉండబోతున్నారని సమాచారం. ఇటువంటి సందర్భాలకు ఇలా వెకేషన్స్ కి వెళ్లడం సెలబ్రెటీలకు అలవాటే. గతంలో కూడా రోజా తన కుటుంబ సభ్యులతో కలసి వెకేషన్ కు విదేశాలకు వెళ్ళింది. అప్పట్లో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.
