Politics

అమరావతి రైతుల కీలక నిర్ణయం – ఏంటో తెలుసా…?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్దీ రోజులుగా రాష్ట్ర రాజధాని విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రజలందరికి మధ్యన ఒకరకమైన పోరాటం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన ఆందోళనలు చేస్తూ, నిరసనలు తెలుపుతున్నారు. ఇకపోతే రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు తమ భూములను ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ మూడు రాజధానుల నిర్మాణానికి అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు తాజాగా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా రేపు రాజధాని అమరావతి బంద్ కి రైతులు పిలుపునిచ్చారు.

కాగా అమరావతి లోని 29 గ్రామాల పరిధిలో బంద్ పాటించాలని స్థానిక రైతులు నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా విద్య, వ్యాపార సంస్థలు బంద్ పాటించాలని జేఏసీ కోరారు. కాగా రాజధానిని అమరావతిలోని కొనసాగించాలని రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. గత కొద్దీ రోజులుగా మూడు రాజధానుల నిర్మాణానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే పోలీసులు తమపై అక్రమంగా దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు బంద్ కి పిలుపునిచ్చారని తెలుస్తుంది.