Movies

ఈ రెండు సినిమాలు ఇప్పుడప్పుడే రావా.? ఎప్పుడు వస్తాయో తెలుసా?

ఈ ఏడాది విడుదల కాబడిన టాలీవుడ్ సినిమాలలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన “సరిలేరు నీకెవ్వరు” మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం “అల వైకుంఠపురములో” ఒకదానిని మించి మరొకటి భారీ హిట్టయ్యాయి.

వెండితెర మీద ఎలా అయితే ఈ చిత్రాలు దుమ్ము రేపాయో అంతే స్థాయిలో డిజిటల్ గా కూడా అంతే సత్తా చాటాయి. అయితే ఈ రెండు చిత్రాల తాలుకా సాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న జెమినీ టీవీ వారు మహేష్ సినిమాను ఇప్పటికే టెలికాస్ట్ చేసెయ్యడం రికార్డు శాయి టీఆర్పీ కొట్టిన సంగతి తెలిసిందే.

దీనితో బన్నీ సినిమా కూడా అంతే స్థాయి టీఆర్పీ సాధించడం ఖాయం అని అంతా అనుకున్నారు అదే ఊపులో జెమినీ టీవీ వారు అతి త్వరలోనే టెలికాస్ట్ చేస్తాం అని తెలిపారు. అలాగే సరిలేరు నీకెవ్వరు సినిమా ఒరిజినల్ వెర్షన్ ను మరోసారి టెలికాస్ట్ చేస్తామని చెప్పారు. కానీ వీటి స్థానాల్లోకి ఇప్పుడు ఒక్కో వార్మ్ ఒక్కో సినిమా లైన్ లోకి వచ్చేసాయి. అంటే ఇంకో నెల రోజుల వరకు ఈ రెండు సినిమాలు జెమినీ ఛానెల్లో టెలికాస్ట్ కావడం అసాధ్యమే అని చెప్పాలి.