Movies

డైరెక్టర్స్ అందరూ పరశురామ్ బాట పడతారా …తప్పదు మరి

టాలీవుడ్ దర్శకుడు పరశురామ్ తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్ అయ్యాడు. శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న యితడు ఇప్పటి వరకు చిన్నా చితకా హీరోలతో చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసాడు. పరశురామ్ ఈ మధ్యే మహేష్ హీరోగా ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రకటించాడు.కరోనా వైరస్ తో విధించిన లాక్‌డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ మరి కొన్ని రోజులు ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి తోడు రిస్క్ వద్దు.. డిసెంబర్ నుంచి షూటింగ్‌కు వెళ్దామని దర్శక నిర్మాతలకు కూడా మహేష్ బాబు చెప్పినట్లు టాక్.

అయితే సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్బంగా ఫస్ట్ లుక్‌తోనే సినిమాపై పరశురామ్ అంచనాలు పెంచేసాడు. మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ గ్యారంటీగా సంచలనం క్రియేట్ చేస్తుందని ఫాన్స్ లో కూడా బలంగా కోరిక ఉంది. పైగా పరశురామ్ పక్కా కమర్షియల్ కథను సిద్ధం చేసాడు. ఈ సినిమాలో సూపర్ స్టార్ మూడు భిన్నమైన గెటప్స్‌లో కనిపించబోతున్నాడని, అందులో ఒకటి కుర్రాడి గెటప్ కూడా ఉందని టాక్. అయితే ఎమౌంట్ కి సంబంధించి డైరెక్టర్ పరశురామ్ అనుసరించిన ఫార్ములా మిగిలిన అగ్ర దర్శకులు కూడా చేస్తే కచ్చితంగా నిర్మాతలకు చాలా ఊరట కలుగుతుందని విశ్లేషకులు కూడా అంటున్నారు. ఇప్పటికే హీరోల పారితోషికంలో కోత తప్పదనే టాక్ ఊపందుకుంది.

ఇంతకీ ఏంటంటే, సర్కారు వారి పాట కోసం 10 కోట్లకు పైగానే పరశురామ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని,అందులో 4 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నాడని, మిగిలింది రిలీజ్ తర్వాత.. పైగా లాభాల్లో షేర్ కూడా తీసుకుంటాడని ఇప్పటికే వైరల్ అయింది. మొత్తం 10 కోట్లకు పైగానే అవుతుందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న మాట ప్రకారం ఈయన తన పారితోషికంలో 3 కోట్లు కోత పెట్టుకున్నాడట. 10 కోట్ల నుంచి 7 కోట్లకు ఆయన కుదించుకున్నాడని సన్నిహితుల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛందంగా తన రెమ్యునరేషన్ కట్ చేసుకున్నాడని,ఇదే అందరికి ఆదర్శం అవుతుందని వినిపిస్తోంది.