Movies

‘బాబు బొమ్మకి పెళ్ళంట’ అసలు టీవీ ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నారో తెలుసా ?

మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక తన 26 వ యేట పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతుంది. పెళ్లి కొడుకు పేరున్న వ్యక్తి కొడుకే. గుంటూరు రేంజ్ ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి కి సంబంధించి ఇటీవల నిశ్చితార్ధం కూడా జరిగిన సంగతి తెల్సిందే. నిజానికి ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు థర్టీ ప్లస్ అయినా సరే, పెళ్లి ఊసెత్తడం లేదు. ఇప్పటికి వారి గ్లామర్ షో తో అభిమానులను ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిహారికకు 30కి ముందే పెళ్లి జరగబోతోంది. ఇప్పటికే నాగబాబు పెళ్లి విషయం అధికారికంగా ప్రకటించగా, నిహారిక తనకు కాబోయే భర్తతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో ఇంతకుముందే షేర్ చేసి హంగామా చేసింది.

అయితే మెగా డాటర్ నిహారిక పెళ్లి పై ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ నాగబాబు.. జీ ఛానెల్ యాజమాన్యంతో కలిసి ‘బాపు బొమ్మకి పెళ్ళంట’ అనే పేరుతో ఓ కొత్త కార్యక్రమం రూపొందించడానికి ప్లాన్ చేశారు. వినాయక చవితి సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతున్నారట. తాజాగా ఈ షో ప్రోమో వీడియో విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించారు. ఈ ప్రోగ్రాం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు నిహారిక పెళ్లి వేడుక ముందే చూపించే ప్రయత్నంలా ఉంది.

అయితే ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే, నిహారిక పెళ్లి గురించి ఇంటరెస్ట్ రావడానికి ఆమె ఓ స్టార్ హీరోయిన్ కానే కాదు. పెద్దగా ఆడియన్స్ లో పేరు కూడా లేదు. మెగా డాటర్ అని తప్ప ఆమెకున్న క్వాలిఫికేషన్స్ ఏమున్నా యన్నది టాక్. అలాంటప్పుడు ఈ ప్రోగ్రాంతో ఒరగబెట్టేందేంటని సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. ఈ వీడియోలో నిహారిక పెళ్లి కూతురు గెటప్లో కనిపించగా.. యాంకర్ అనసూయ తల్లి గెటప్ లో నిహారికకు పెళ్లి బట్టలు పెట్టిన సీన్స్ ప్రోమోలో కనిపిస్తాయి. నిజానికి ఈ ప్రోగ్రాం చేయడం పట్ల సినీ అభిమానులు, టీవీ ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపడంలేదని అంటున్నారు.