Movies

ప్రభాస్ ‘ఆదిపురుష్’ గ్రాఫిక్స్ ఖర్చు తెలిస్తే షాకవ్వాలి…అంత నమ్మకమా ?

తానాజీ చిత్ర దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రాన్ని ఇటీవల వెల్లడించాడు. విజువల్ వండర్ గా తెరకెక్కించనున్న ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ పోస్టర్ను సైతం ప్రభాస్ విడుదల చేశాడు. ‘ఆదిపురుష్’ పేరుతో రానున్న ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రూపొందనున్నట్లు పోస్టర్లో వెల్లడించారు.

దాదాపు 500కోట్ల రూపాయలతో అంత్యంత భారీగా నిర్మించే ఈ మూవీలో కేవలం గ్రాఫిక్స్ కోసమే ఏకంగా 250కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు టాక్. ఇప్పటివరకూ ఏ ఇండియన్ మూవీలో కూడా ఇంత భారీగా గ్రాఫిక్స్ కి ఖర్చుచేసిన దాఖలాలు లేవన్న మాట వినిపిస్తోంది. కేవలం ప్రకటనలు చూసాక ఈ మూవీ ఎంత త్వరగా చూసేద్దామా అని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.

గుల్షన్ కుమార్, టి–సిరీస్ల సమర్పించే ఈ చిత్రానికి మొత్తం ఐదుగురు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. భూషణ్కుమార్, కృషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు ఈ చిత్రానికి ప్రొడ్యూసర్స్ కావడం విశేషం. హీరోయిన్,ఇతర తారాగణం ఎంపిక అయ్యాక ఈ మూవీ సెట్స్ మీదికి రానుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."