చెర్రీ సరసన నటించే కియారా రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్…?
Tollywood Heroine kiara advani :బాహుబలి తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి తెరెకెక్కిస్తున్న మూవీ ఆర్ ఆర్ ఆర్. మెగా పవర్ స్టార్ రామ్చరణ్- జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో ఈ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరోపక్క శంకర్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ లో రామ్ చరణ్ నటించబోతున్నాడు. ఈ చిత్రంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ సైతం ఓ కీలక పాత్రలో మెరవబోతున్నట్లు తెలుస్తోంది.
శ్రీ వెంకటేశ్వర బ్యానర్పై దిల్ రాజు నిర్మించే ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా చేస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. గతంలో వినయ విధేయ రామలో చెర్రీతో రొమాన్స్ చేసిన కియారా మరోసారి ఈ సినిమాతో జోడీ కడుతోంది.
కబీర్సింగ్ విజయంతో స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ దక్కించుకున్న కియారా ఇప్పుడు భారీ రెమ్యునరేషన్ ఛార్జి చేస్తోందట. ఇది వరకు ఒక్కో సినిమాకు మూడున్నర నుంచి 4 కోట్ల వరకు అందుకునే కియారా ఇప్పుడు మరో కోటి రూపాయలు అదనంగా పెంచేసిందని టాక్. ముఖ్యంగా చెర్రీతో చేసే పాన్ ఇండియా మూవీలో నటించడానికి కియారా ఏకంగా 5కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.