MoviesTollywood news in telugu

2021 లో కన్నుమూసిన తెలుగు సెలబ్రిటీలు

Tollywood Celebrities Who Died in 2021 : చావు పుట్టుకలు సహజమే అయినా పోయినపుడు బాధపడడం సహజం. 2021లో మరణించిన సెలబ్రిటీల విషయానికి వస్తే, హీరోయిన్ గా, క్యారెక్టర్ యాక్టర్ గా అలరించిన ప్రముఖ నటి జయంతి 76ఏళ్ళ వయస్సులో అనారోగ్య సమస్యతో కన్నుమూసింది. వేదం మూవీతో ఎంట్రీ ఇచ్చిన వేదం నాగయ్య 77ఏళ్ళ వయస్సులో మార్చి 27న కన్నుమూశారు.

ఏప్రియల్ 25న నటుడు పొట్టి వీరయ్య కన్నుమూశాడు. ప్రొడ్యూసర్ గా, పబ్లిసిటీ డిజైనర్ గా వ్యవహరించిన బిఎ రాజు 57ఏళ్ల వయస్సులో మే 21న కన్నుమూసారు. తమిళ నటుడు వివేక్ ఏప్రియల్ 17న కన్నుమూశాడు. సింగం వంటి డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.

ఏప్రియల్ 26న డైరెక్టర్ సాయిబాలాజీ మరణించాడు. యాంకర్ గా, నటుడిగా యూట్యూబర్ గా ఖ్యాతి గాంచిన టి ఎన్ ఆర్ దురదృష్టవశాత్తూ ఇదే ఏడాది మే 10న కన్నుమూశారు. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా బామ్మగా గుర్తింపు పొందిన టివి నటి సురేఖ సిక్రి జులై 16న కన్నుమూశారు.

118, తిమ్మరుసు వంటి మూవీస్ కి నిర్మాతగా వ్యవహరించిన మహేష్ కోనేరు 40ఏళ్ల వయస్సులో అక్టోబర్ 12న కన్నుమూశాడు.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి మూవీస్ లో గోదావరి యాసలో అలరించిన రాజబాబు అక్టోబర్ 24న ఈలోకం నుంచి నిష్క్రమించారు. నృత్య దర్శకుడిగా కొన్ని వందల మూవీస్ కి డాన్స్ మాస్టర్ గా చేసిన శివశంకర్ మాస్టర్ నవంబర్ 28న కన్నుమూశారు.

సిరివెన్నెల సినిమాతో గీత రచయిత గా ఎంట్రీ ఇచ్చి, ఆ సినిమాయే తన ఇంటిపేరుగా వాడుకలోకి తెచ్చుకుని వేలాది అద్భుత గీతాలు అందించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి నవంబర్ 30న 66ఏళ్ళ వయస్సులో ఈ లోకం నుంచి నిష్క్రమించారు.