1 స్పూన్ 10 ఏళ్ల నాటి మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు కూడా 1 రాత్రిలోనే మాయం చేస్తుంది
Joint Pains : ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు వంటివి అరవై సంవత్సరాలు వచ్చాక వచ్చేవి. ప్రస్తుతం మారిన జీవనశైలి పరిస్థితులు, సరైన పోషకాహారం తీసుకోకవటం, శారీరక శ్రమ లేకపోవటం వంటి కారణాలతో ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి అన్నీ రకాల నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇలా నొప్పులు వచ్చినప్పుడు చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు.

అలా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం కనపడుతుంది. సమస్య ప్రారంభ దశలో ఉన్నప్పుడూ ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి. నొప్పులు ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించి డాక్టర్ చెప్పిన సూచనలను పాటిస్తూ ఇంటి చిట్కాలు ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.

పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కాస్త వేడి అయ్యాక అరస్పూన్ శొంఠి పొడి, అరస్పూన్ పసుపు వేసి రెండు నిమిషాలు మరిగించి గ్లాస్ లోకి వడకట్టి అరస్పూన్ తేనె కలిపి తాగాలి. శొంఠి పొడి,పసుపులో ఉన్న లక్షణాలు నొప్పులను తగ్గించటానికి మరియు వాపును తగ్గించటానికి సహాయపడుతుంది.

మెంతులను నొప్పులను తగ్గించటానికి పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. మెంతులను మెత్తని పొడిగా చేసుకోవాలి. ఒక బౌల్ లో ఒక స్పూన్ పొడిని వేసి నీరు పోసి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని నొప్పి ఉన్న ప్రదేశంలో రాసి దాని చుట్టూ ఒక క్లాత్ చుట్టి అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని కొబ్బరి నూనె రాసి ఒక నిమిషం సున్నితంగా మసాజ్ చేయాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

