MoviesTollywood news in telugu

ఓటీటీలోకి నరేష్ ‘మళ్ళీ పెళ్లి’..ఎప్పుడు…ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందంటే!

Malli Pelli Ott release Date:నరేష్, పవిత్ర లోకేష్ జంటగా సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన మళ్లీ పెళ్లి సినిమా థియేటర్స్ లో మే 26వ తేదీన సందడి చేసింది. ప్రేక్షకుల నుంచి స్పందన కూడా చాలా తక్కువగానే వచ్చింది. ఇక ఇప్పుడు OTT లో సందడి చేయడానికి సిద్ధం అయింది. ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను కొనుగోలు చేసింది.

జూన్ 23 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అమెజాన్ తాజాగా ప్రకటించింది.’మళ్లీ పెళ్లి’సినిమాలోని చాలా వివాదాస్పద సన్నివేశాలను సెన్సార్ వాళ్లు కట్ చేశారు. ఇప్పుడు వాటిని కూడా యాడ్ చేసి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమాను విజయకృష్ణ మూవీస్‌ పతాకంపై నరేష్‌ నిర్మించారు.